ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ లోగో ఆవిష్కరణ
మ్యాచ్ తొలి నుంచే సింధు ఒకుహారాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్లో 5-5తో కొంత పోటీనిచ్చిన ఒకుహారా.. రెండో సెట్లో పూర్తిగా తేలిపోయింది. ఇక శనివారం జరిగే సెమీస్లో చైనా షట్లర్, రెండో సీడ్ చెన్ యుఫీతో సింధు తలపడనుంది. ఒకుహారా, సింధు 15 సార్లు తలపడగా.. ఏడు సార్లు ఒకుహారా, ఎనమిది సార్లు సింధు గెలిచింది.
Sindhu in the Semis⚡🤺
— BAI Media (@BAI_Media) 19 July 2019
🇮🇳 top shuttler @Pvsindhu1 avenges her loss over world no2⃣ @NozomiOkuhara with a commanding win 2⃣1⃣-1⃣4⃣,2⃣1⃣-7⃣ as she storms into the semifinals of #BlibliIndonesiaOpen.
Sindhu overtakes Okuhara
8⃣-7⃣ in h2h record.
Go for the GOLD🔥#IndiaontheRise pic.twitter.com/TU6RoklyEo
గురువారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్లో సింధు 21-14, 17-21, 21-11 తేడాతో మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. 62 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సింధు మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్ కైవసం చేసుకుంది. గురువారమే జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో హైదరాబాదీ ప్లేయర్, 8వ సీడ్ శ్రీకాంత్కు పరాజయం ఎదురైంది. హాంకాంగ్కు చెందిన లాంగ్ అంగూస్ చేతిలో 17-21, 19-21 తేడాతో వరుస గేమ్ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తొలి గేమ్ను నాలుగు పాయింట్ల తేడాతో కోల్పోయినా.. రెండో గేమ్ను కాపాడుకునేందుకు వచ్చిన అవకాశాన్ని శ్రీకాంత్ చేజార్చున్నాడు. ఇక చివర్లో ప్రత్యర్థికి రెండు గేమ్ పాయింట్లను ఇచ్చి ఓడిపోయాడు.