51 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో
51 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో తొలి గేమ్లో అద్భుతంగా సాగింది. తొలి గేమ్లో 8-4తో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణీత్.. ఆ తర్వాత కాస్త వెనుకబడ్డాడు. ప్రత్యర్థి పుంజుకోవడంతో స్కోరు 10-10 వద్ద సమమైంది. ఒక దశలో 20-19తో ప్రణీత్ నిలిచినా... జొనాథన్ కూడా పోరాడటంతో 22-22 వరకు పాయింట్లు సమమవుతూ వెళ్లాయి.
ప్రణీత్ కొట్టిన బలమైన షాట్ను
ఓ చక్కటి షాట్తో మ్యాచ్ను సొంతం చేసుకోవాలని భావించినా క్రిస్టీ అంతే అద్భుతంగా దాన్ని రిటర్న్ చేశాడు. అయితే ప్రణీత్ కొట్టిన బలమైన షాట్ను రిటర్న్ చేసే క్రమంలో క్రిస్టి నెట్ వద్ద తడబడ్డాడు. ఆ సమయంలో క్రాస్కోర్ట్ షాట్ ద్వారా వరుసగా రెండు పాయింట్లు సాధించిన ప్రణీత్ గేమ్ను ఖాతాలో వేసుకున్నాడు.
రెండో గేమ్లో ప్రత్యర్థికి ఏమాత్రం
రెండో గేమ్లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని ప్రణీత్ 7-1, 11-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. వరుస పాయింట్లతో హోరెత్తించాడు. ఆ తర్వాత క్రిస్టీ తేరుకొని దగ్గరకు వచ్చినా సాయి ప్రణీత్ మాత్రం ఎలాంటి తడబాటుకు లోను కాకుండా 21-14తో రెండో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.
గత 36 ఏళ్లలో ఇదే మొదటిసారి
గత 36 ఏళ్లలో ఒక భారత షట్లర్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సెమీఫైనల్లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతకముందు 1983లో ప్రకాశ్ పదుకొనె ఈ మెగా ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. మ్యాచ్ అనంతరం సాయి ప్రణీత్ మాట్లాడుతూ "చాలా ఆనందంగా ఉంది. ఈ విజయాన్ని మాటల్లో వర్ణించలేను. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గోపీచంద్ సర్ అటాక్ చేయకు.. రిథమ్ మార్చు అని సూచించారు. అది చక్కటి ఫలితాన్నిచ్చింది" అని అన్నాడు.