ఓ సరికొత్త రికార్డు
ఈ మ్యాచ్ వీక్షణపరంగా ఓ సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. 2010లో బ్రస్సెల్స్ వేదికగా కిమ్ క్లిజ్స్టర్స్, సెరెనా విలియమ్స్ల మధ్య జరిగిన ఓ టెన్నిస్ మ్యాచ్ని 35,681 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఆ రికార్డుని రోజర్ ఫెదరర్-రఫెల్ నాదల్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ బద్దలు కొట్టనుంది.
టికెట్లను కొనుగోలు చేసేందుకు
ఫెదరర్-నాదల్ మ్యాచ్కి సంబంధించి టికెట్లను కొనుగోలు చేసేందుకు గాను ఆన్ లైన్తో పాటు ప్రత్యేకంగా ఔట్ లెట్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రోజర్ ఫెదరర్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జనానీ హండల్ మాట్లాడుతూ "టికెట్ అమ్మకాలు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. మద్దతు ఇచ్చినందుకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు" తెలిపారు.
ఒక్కొక్కరికి ఆరు టికెట్లు మాత్రమే
ఒక్కో అభిమాని కేవలం ఆరు టికెట్లు మాత్రమే కొనుగోలు చేసే విధంగా నిబంధన విధించారు. ఇక, టికెట్ ధరలు ($10 to 130/9 to 119 euros) నిర్ణయించారు. ఫిబ్రవరి 7న ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ని నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్కి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో గ్యాలరీలో ప్రత్యేకంగా అదనపు స్టాండ్స్ను ఏర్పాటు చేయనున్నారు.
రెండో స్థానంలో రఫెల్ నాదల్
ప్రస్తుతం టెన్నిస్ ర్యాంకింగ్స్లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రెండో స్థానంలో కొనసాగుతుండగా... రోజర్ ఫెదరర్ మూడో ర్యాంకులో ఉన్నాడు. ఇక, సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.