బ్యాటింగ్ కోచ్ వారిద్దరితో మాట్లాడారు
"బ్యాటింగ్ కోచ్ వారిద్దరితో ఒక మాట మాట్లాడారు. దీంతో ఎవరు ఏ స్థానంలో వెళ్లాలనే దానిపై సమాచారలోపం ఉంది. నిజానికి ఇది కొంచెం ఫన్నీగా ఉంది. ఎందుకంటే వారిద్దరూ మైదానంలోకి రావాలని అనుకున్నారు. ఇద్దరూ పిచ్కు చేరుకుంటే చాలా ఫన్నీగా ఉండేది. అప్పుడు మైదానంలో మైదానంలో ముగ్గురు బ్యాట్స్ మెన్ ఉండేవారు" అని కోహ్లీ అన్నాడు.
NO.4 స్థానంలో ఎవరిని ఆడించాలని
NO.4 స్థానంలో ఎవరిని ఆడించాలని అనుకున్నారు? అన్న ప్రశ్నకు గాను కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు. "10 ఓవర్లు ముగిసిన తర్వాత రిషబ్ పంత్ను ఆ స్థానంలో పంపాలని అనుకున్నాం. అంతకముందుగా అయితే శ్రేయాస్ అయ్యర్ను పంపాలని నిర్ణయం తీసుకున్నాం. దీంతో వారిద్దరూ ఏ స్థానంలో ఎవరు బ్యాటింగ్కు రావాలనే అంశంపై చిన్నపాటి గందరగోళానికి గురయ్యారని నేను భావిస్తున్నా" అని చెప్పాడు.
ఓటమిపై కోహ్లీ ఇలా
ఈ మ్యాచ్లో ఓటమిపై కోహ్లీ మాట్లాడుతూ "గేమ్ పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయలేకపోయాం. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడం మాకు అనుకూలించలేదు. కొన్ని సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు మాకు అదే జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో మాకు ప్రతికూల ఫలితం వచ్చిందనే విషయాన్ని కూడా కాదనలేం" అని చెప్పుకొచ్చాడు.
పిచ్ను అంచనా వేయడంలో విఫలమయ్యాం
"రాబోయే మ్యాచ్ల్లో దీనిని పునరావృతం చేయం. పిచ్ను అంచనా వేయడంలో విఫలమయ్యామనే అనుకుంటున్నా. ఇందులో మేము ఇంకా మెరుగవ్వాలి" అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇక, మూడో టీ20లో సమిష్టి ప్రదర్శన చేసిన సఫారీ జట్టుపై విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ జట్టులో ప్రతీ ఒక్కరూ మంచి ప్రదర్శన చేయడం వల్లే ఈ మ్యాచ్లో ఓడామని అన్నాడు.