వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయి
కాగా, వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్లు తీసుకోగా సౌరవ్ గంగూలీ 263, రికీ పాంటింగ్ 266 ఇన్నింగ్స్లు తీసుకున్నారు. అయితే కోహ్లీ మాత్రం ఇప్పటి వరకు ఆడింది 204 ఇన్నింగ్స్లే. దీనిని బట్టి చూస్తే సచిన్ కన్నా అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయి కోహ్లీ అందుకోనున్నాడు.
తొలి వన్డేలో 140 పరుగులు చేసిన కోహ్లీ
గువహటి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 140 పరుగులు చేయడంతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేశాడు. మూడేళ్ల పాటు వరుసగా 2,000పై చిలుకు పరుగులు చేసిన బ్యాట్స్మెన్స్ జాబితాలో విరాట్ కోహ్లీ చేరాడు. వరుసగా మూడు కేలండర్ ఇయర్స్ (20016-18)లో 2000కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగానూ సచిన్, హెడెన్, జో రూట్ సరసన కోహ్లీ నిలిచాడు.
|
ఎలైట్ జాబితాలోకి విరాట్ కోహ్లీ
సచిన్ 1996-98 సంవత్సరాల మధ్య 2,000లకు పైగా పరుగులు సాధించాడు. మాథ్యూ హేడెన్ కూడా 2002-2004 సంవత్సరాల మధ్య ఏడాదికి రెండువేలకు పైగా పరుగులు సాధించాడు. జో రూట్ సైతం 2015-17 సంవత్సరాల మధ్య ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ సైతం 2015-18 సంవత్సరాల మధ్య ఏడాదికి రెండువేలకు పైగా పరుగులు చేశాడు.
తొలి వన్డేలో బౌండరీతో వన్డేల్లో 36వ సెంచరీ
తొలి వన్డేలో ఇన్నింగ్స్ 27వ ఓవర్లో బౌండరీతో కోహ్లీ తన 36వ సెంచరీని సాధించాడు. ఈ ఏడాది కోహ్లీకి ఇది నాలుగో వన్డే సెంచరీ కావడం విశేషం. 386 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ.. సచిన్కన్నా 40 ఇన్నింగ్స్లు తక్కువ ఆడి ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో 36, టెస్టుల్లో 24 సెంచరీలతో ఉన్న ఈ విరాట్ కోహ్లీ మొత్తంగా 60 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో నిలిచాడు.
|
50 ఇన్నింగ్స్ల్లో కోహ్లీ ఈ మైలురాయి
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (100), రికీ పాంటింగ్ (71), కుమార సంగక్కర (63), జాక్వస్ కలిస్ (62) ముందున్నారు. తొలి వన్డేలో కోహ్లీ సాధించిన సెంచరీ ఛేదనలో అతడికిది 22వ సెంచరీ కాగా స్వదేశంలో 15వది. ఇక, కెప్టెన్గా కోహ్లీ సాధించిన సెంచరీల సంఖ్య 14. 50 ఇన్నింగ్స్ల్లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు.
|
ఘనంగా స్వాగతం పలికిన హోటల్ సిబ్బంది
ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ (22) తర్వాతి స్థానంలో కోహ్లీ ఉన్నాడు. పాంటింగ్ 220 ఇన్నింగ్స్ల్లో ఈ సెంచరీలు చేశాడు. బుధవారం జరిగే రెండో వన్డే కోసం కోహ్లీ సేన సోమవారం ఉదయం విశాఖపట్నంలో అడుగుపెట్టింది. ఆటగాళ్లకు హోటల్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. వారిని చూసేందుకు అభిమానులు పోటెత్తారు.