97 ఇన్నింగ్సుల్లో 2,434 పరుగులు
ఇక, రోహిత్ శర్మ 97 ఇన్నింగ్సుల్లో 2,434 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్లో ఉన్న విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ కేవలం 8 పరుగుల వెనుకంజలో ఉన్నాడు. అయితే, ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న మూడో టీ20లో కోహ్లీ రికార్డును బద్దలు చేసేందుకు రోహిత్ శర్మ సిద్ధంగా ఉన్నాడు.
రెండో టీ20లో 12 పరుగులు చేసిన రోహిత్
మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ... మూడో టీ20లో ఓపెనర్ కాబట్టి 8 పరుగులు చేస్తే కోహ్లీ రికార్డుని బద్దలు కొడతాడు. అయితే, రోహిత్ తక్కువ స్కోరుకే పరిమితమైతే విరాట్ కోహ్లీ రికార్డు పదిలంగా ఉంటుంది. ఆ తర్వాత వన్డౌన్లో ఎలాగూ విరాట్ కోహ్లీ వస్తాడు కాబట్టి తన స్కోరుని మరింత పెంచుకుంటాడు.
ధావన్ టీ20ల్లో 6,996 పరుగులు
మరో ఓపెనర్ శిఖర్ ధావన్ టీ20ల్లో 6,996 పరుగులు చేశాడు. మరో నాలుగు పరుగులు చేస్తే టీ20ల్లో ఏడువేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అదే గనుక జరిగితే టీ20ల్లో ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్ మన్గా శిఖర్ ధావన్ నిలుస్తాడు. ధావన్కు ముందు కోహ్లీ, సురేశ్ రైనా, రోహిత్ శర్మలు ఈ ఘనత సాధించారు.
దక్షిణాఫ్రికాపై స్వదేశంలో
ఇదిలా ఉంటే, ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.... మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాపై స్వదేశంలో టీమిండియా టీ20 సిరీస్ను గెలవని నేపథ్యంలో మూడో టీ20ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.