ఏ టోర్నీలోనైనా భారత్ను ఓడించడం చాలా టఫ్
ఇక యూఏఈలో జరిగే 2022 ఆసియాకప్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆగస్టు 28న జరగబోయే మ్యాచ్ గురించి కూడా పాంటింగ్ తన స్పందనను తెలియజేశాడు. 2021 టీ20 ప్రపంచకప్లో 10వికెట్ల భారీ తేడాతో పాకిస్థాన్ ఇండియాపై గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక ఆ పరాజయానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటుంది. అయితే భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడి టోర్నీకి దూరమవడంతో భారత బౌలింగ్ విభాగానికి కాస్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. అయినప్పటికీ భారత్ను ఓడించడం పాకిస్థాన్కు కష్టమని పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
భారతే గెలుస్తుంది
'పాకిస్థాన్ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్లో విజయం ఎవరిదనే విషయంలో నేను భారత్నే పేర్కొంటాను. అలా అని పాకిస్తాన్ అంత చులకన చేసే జట్టేమి కాదు. ఆ జట్టు కూడా ప్రస్తుతం చాలా టఫ్గా ఉంది. సూపర్ స్టార్ ప్లేయర్లతో పాక్ ప్రస్తుతం దుర్భేద్యంగా ఉంది. అయినా కానీ కేవలం ఆసియా కప్లోనే కాదు.. ఏ టోర్నీలోనైనా భారత్ను ఓడించడం ఎల్లప్పుడూ కష్టమే.. రాబోయే టీ20 ప్రపంచకప్ విషయంలో కూడా భారత్ చాలా టఫెస్ట్ టీం అని నేను అనుకుంటున్నాను.
వారి బ్యాటింగ్ మరియు బౌలింగ్ డెప్త్ కచ్చితంగా ఇతర జట్ల కంటే మెరుగ్గా ఉంటుంది. ఆసియా కప్ భారత్ గెలుస్తుందని నేను భావిస్తున్నాను' అని రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ ఎపిసోడ్లో అన్నారు.
ఇండియా వర్సెస్ పాక్.. ఆసీస్ వర్సెస్ ఇంగ్లాండ్ సేమ్
ఇక నేను చిరకాల ప్రత్యర్థుల గురించి ఆలోచించినప్పుడు.. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ తలపడే యాషెస్ టెస్ట్ సిరీస్ తొలుత గుర్తుకొస్తుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అది టఫ్ అండ్ టఫ్ అని నేను అనుకుంటాను. అలాగే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందని చెబుతాను. ప్రస్తుతం ఈ రెండు టీంలు కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి కానీ.. టెస్ట్ మ్యాచ్లు ఆడినా కూడా ఈ జట్ల మధ్య చాలా టఫ్ పోటీ ఉంటుందని' పాంటింగ్ పేర్కొన్నాడు.