ఓడిపోయానని చెప్పడం లేదు..
'వాంఖడే వంటి మైదానాల్లో సెకండ్ బౌలింగ్ చేయడం చాలా కష్టం. మా బౌలింగ్ యూనిట్ ఈ పరిస్థితులను ముందే ఊహించి దానికి అనుగుణంగా సిద్దమయ్యాం. కానీ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ఢిల్లీని అడ్డుకోలేకపోయాం. సెకండ్ ఇన్నింగ్స్లో రెగ్యూలర్గా బంతిని మార్చితే ఈ డిస్ అడ్వాంటేజ్ను అధిగమించవచ్చనేది నా అభిప్రాయం. అలా చేస్తేనే సెకండ్ బౌలింగ్ చేసే జట్టుకు న్యాయం జరుగుతుంది. నేనేదో ఓడిపోయాననే బాధలో ఈ మాట చెప్పడం లేదు. ఫలితాన్ని డ్యూ ప్రభావం శాసించకుండా చేసేందుకే బంతిని మార్చాలని, సెకండ్ బౌలింగ్ చేసే జట్టుకు ఉన్న డిస్ అడ్వాంటేజ్ను తొలగించాలని చెబుతున్నా.
బాల్ మార్చుకునే ..
బౌలర్లు తడి బంతితో నెట్స్లో ప్రాక్టీస్ చేసినప్పటికీ ఫీల్డ్లో తీవ్ర ఒత్తిడి మధ్య రాణించడం చాలా కష్టం అవుతోంది. చాలా సార్లు బంతిని మార్చాలని అంపైర్ను అడిగాను. కానీ నిబంధనల్లో బంతిని మార్చే వెసులు బాటు లేదన్నారు. సెకండ్ బౌలింగ్ చేసే జట్టుకు కష్టమవుతున్న నేపథ్యంలో బంతిని మార్చుకునే వెసులుబాటు కల్పించాలి.'అని రాహుల్ సూచించాడు. ఇక ఢిల్లీతో మ్యాచ్లో డ్యూ ప్రభావం కారణంగా పంజాబ్ బౌలర్లు తేలిపోయారు. బంతి పదే పదే జారుతుండటంతో నోబాల్స్ ఎక్కువగా వేసారు.
గర్జించిన గబ్బర్..
ఇక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 69), బర్త్డే బాయ్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, లుక్మాన్ మెరివాలా, కగిసోరబడా, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 198 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. ధావన్కు తోడుగా పృథ్వీ షా(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32), మార్కస్ స్టోయినిస్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 27 నాటౌట్) రాణించారు. పంజాబ్ బౌలర్లలో రిచర్డ్సన్ రెండు వికెట్లు తీయగా.. రిలే మెరిడిత్, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు.