నొప్పి తీవ్రతరం అవడంతో
అయితే, టోర్నీ సమయంలో ఆ నొప్పి తీవ్రతరం అవడంతో పాటు నాకౌట్ మ్యాచ్లో ధోని చేతికి మణికట్టుకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకుని నవంబర్ నాటికి ధోని ఫిట్ అవుతాడని భావిస్తున్నారు. ఈ కారణం చేతనే ధోని నవంబర్ వరకు సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండడని చెప్పినట్లు తెలుస్తోంది.
38 ఏళ్ల ధోని ఫిజికల్గా ఫిట్
38 ఏళ్ల ధోని ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పటికీ వెన్నునొప్పి మాత్రం అతడిని గత కొంతకాలంగా బాధిస్తోంది. ఐపీఎల్ 2018 సీజన్లో కింగ్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఫిజియోతో ధోని సపర్యలు కూడా చేయించుకున్నాడు. ఆ మ్యాచ్లో ధోని పంజాబ్పై 79 పరుగులతో చెలరేగాడు.
ప్రపంచకప్ 2019 చివరిదని అనుకున్నారు
నిజానికి ప్రపంచకప్ 2019 ధోనీ చివరిది అని అనుకున్నారు. సెమీస్లో న్యూజిలాండ్పై ఆడిన మ్యాచే ధోనీకి చివరిది అని ప్రచారం సాగింది. కానీ.. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రెండు నెలల విరామం తీసుకుని భారత ఆర్మీలో సేవలందించాడు. విధుల్లో భాగంగా 106 టెరిటోరియల్ ఆర్మీ (పారా బెటాలియన్)లో సేవ చేయడానికి 15 రోజులు కాశ్మీర్లో గడిపాడు.
కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు
అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్ళాడు. ధోనీ సెలక్షన్ కమిటీకి నవంబర్ వరకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఈ వార్తతో ధోనీ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఏదేమైనా ఐపీఎల్-13లో జట్టు చెన్నైకి ధోనీ సారధ్య భాద్యతలు నిర్వహిస్తాడని స్పష్టం అయింది.