ఓపెనర్లు సరిగా రాణించలేకపోయినప్పటికీ
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్లతో పాటు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండేలు ఆశించిన మేర రాణించనప్పటికీ దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యాలు ఆదుకోవడంతో భారత్ చివరకు గట్టెక్కింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కృనాల్ పాండ్యా 9 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో అజేయంగా 21 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బౌలింగ్ చేసేటప్పుడు కృనాలే అడిగి
కాగా, భారత్ బౌలింగ్ చేసేటప్పుడు మాత్రం కృనాల్ అడిగి మరీ బౌలింగ్ తీసుకున్న విషయాన్ని మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ‘ విండీస్ కీలక ఆటగాడు పొలార్డ్ క్రీజ్లో ఉన్న సమయంలో నేను బౌలింగ్ చేస్తానని కృనాల్ అడిగాడు. ఆ వికెట్ కోసం కృనాల్ పట్టుబట్టీ మరీ బౌలింగ్ చేశాడు. అలా అడిగా బౌలింగ్ చేయడమే కాదు.. పొలార్డ్ వికెట్ను కూడా కృనాల్ ఖాతాలో వేసుకున్నాడు.' అని కృనాల్ను కొనియాడుతూ.. రోహిత్ చెప్పుకొచ్చాడు.
3 ముంబై ఇండియన్స్కు చెందిన వారే
గమనించాల్సిన విషయం ఏమిటంటే కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రోహిత్ శర్మ ముగ్గురు ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన వారే కావడం గమనార్హం. ఇదే క్రమంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడే పొలార్డ్ను కృనాల్ దగ్గర్నుంచి గమనించడం కూడా బౌలింగ్ అడిగేందుకు ఓ కారణమంటూ కెప్టెన్ తెలిపాడు.
ఇంతకంటే కెప్టెన్కు కావాల్సింది
'ఒక జట్టు ఏమైతే ఆశిస్తుందో అదే కృనాల్ చేసి చూపెట్టాడు. ఇలా ప్రతీ క్రికెటర్ తమ ఛాలెంజ్లను సమర్ధవంతంగా నిర్వర్తించేటప్పుడు కెప్టెన్కు కావాల్సింది ఏముంటుంది' అని రోహిత్ తెలిపాడు. కృనాల్.. 4 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసిన కృనాల్.. ఛేదనలో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు.