ఐదో బంతికి ఔటైన జడేజా
కానీ, ఐదో బంతిని గాల్లోకి లేపిన జడేజా ఔట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. అంతకముందు 2014లో ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా జడేజాను ఆఖరి బంతిని ఆడాడు.
2014లో న్యూజిలాండ్తో
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 314 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 13.1 ఓవర్లకు భారత్ స్కోరు 72-2గా ఉంది.
అశ్విన్, జడేజా హాఫ్ సెంచరీ
మిడిలార్డర్ రాణించడంతో 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 184-6గా ఉంది. దీంతో భారత్ ఓటమి ఖాయమని అనుకున్నారంతా. అనంతరం క్రీజులోకి వచ్చిన అశ్విన్, జడేజాలు 65, 66 పరుగులతో రాణించారు. 31 బంతుల్లో భారత్ విజయానికి 45 పరుగులు అవసరమైన తరుణంలో అశ్విన్ పెవిలియన్కు చేరాడు.