విండిస్తో టెస్టు సిరిస్లో ఒత్తిడేమీ లేదు
"ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతామో నాకు పర్సనల్గా తెలియదు. ఒత్తిడేమీ లేదు. ప్రతి ఒక్కరూ తమ సత్తా తెలియజేసేందుకు ఇదో చక్కని అవకాశం. ముంబై, భారత్-ఏ తరఫున ఆడినట్టే ఇక్కడా ఆడాలని పృథ్వీషాకు సలహా ఇస్తున్నా. మయాంక్, పృథ్వీషా, సిరాజ్ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించారు" అని రహానే అన్నాడు.
అత్యుత్తమంగా ఆడటమే ఇక్కడ ముఖ్యం
"బ్యాట్స్మెన్గా పరుగులు చేస్తారు. బౌలర్గా వికెట్లు తీస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అత్యుత్తమంగా ఆడటమే ఇక్కడ ముఖ్యం" అని రహానే అన్నాడు. ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో రహానే పెద్దగా రాణించింది లేదు. అయితే, ఆ తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టుని విజయవంతంగా ముందుకు నడిపించాడు.
విజయ్ హజారే ట్రోఫీలో మెరిసిన రహానే
బరోడా, కర్ణాటక, రైల్వేస్ జట్లతో జరిగిన మ్యాచ్ల్లో ముంబై జట్టు విజయాలు నమోదు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. వెస్టిండిస్తో టెస్టు సిరిస్కు ముందు ఇది అతడికి బాగా ఉపయోగపడింది. దేశవాళీ, అంతర్జాతీయ లేదా ప్రాక్టీస్ మ్యాచ్ ఏదైనా తాను ఒకే విధంగా సన్నద్ధమవుతానని రహానే ఈ సందర్భంగా చెప్పాడు.
|
కేఎల్ రాహుల్తో ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ లేదా పృథ్వీషా
అయితే, వెస్టిండిస్తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో కేఎల్ రాహుల్తో ఓపెనర్గా మయాంక్ అగర్వాల్, పృథ్వీషాల్లో ఎవరు వస్తారనే విషయంపై మాత్రం రహానే స్పష్టంగా చెప్పలేకపోయాడు. రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా తొలి టెస్టు రాజ్కోట్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం అవుతుండగా, రెండో టెస్టు అక్టోబర్ 12 నుంచి హైదారాబాద్ వేదికగా జరగనుంది.