|
పేలవ ప్రదర్శన కారణంగా
అయితే, పేలవ ప్రదర్శన కారణంగా ఈ సిరిస్లో చోటు దక్కించుకోలేపోయాడు. విశాఖ టెస్టులో సాహా అద్భుత ప్రదర్శన చేయడంతో రెండో టెస్టుకు కూడా సాహానే జట్టు మేనేజ్మెంట్ కొనసాగించింది. అయితే, గాయం కారణంగా మూడో టెస్టులో సాహా మైదానాన్ని వీడటంతో పంత్ గ్లౌవ్స్ ధరించి కీపింగ్ చేస్తున్నాడు. రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఓటమి దిశగా సాగుతోంది.
|
48 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు
ఆటలో భాగంగా మూడోరోజైన సోమవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 48 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇంకా 132 పరుగుల వెనుకంజలోనే ఉంది. ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ముందు ఈ పరుగులు సాధించాలి. ఇంకా రెండు వికెట్లు మాత్రమే ఉండటంతో టీమిండియా ఇన్నింగ్స్ భారీ విజయం ఖాయంగా కనబడుతోంది.
|
షమీకి మూడు వికెట్లు
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో షమీ మూడు వికెట్లు తీయగా... ఉమేశ్ యాదవ్ రెండు, జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీశారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 162 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత జట్టుకు 335 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో సఫారీలను కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి ఫాలో ఆన్కు ఆహ్వానించాడు.
|
మూడో టెస్టులో కూడా ఫాలోఆన్
దీంతో మూడో టెస్టులో దక్షిణాఫ్రికాకు మళ్లీ ఫాలోఆన్ ముప్పు తప్పలేదు. పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో కూడా దక్షిణాఫ్రికాను విరాట్ కోహ్లీ ఫాలో ఆన్ ఆడించిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా... షమీ, నదీమ్, రవీంద్ర జడేజాలు తలో రెండు వికెట్లు పడగొట్టారు.