హైదరాబాద్: న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా మూడు ఓవర్ల వ్యవధిలో ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్లను చేజార్చుకుంది. 244 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు స్కోరు 39 పరుగుల వద్ద శిఖర్ ధావన్(28) వికెట్ను కోల్పోయింది.
అసలేం జరిగింది?: గాయం కారణంగా మూడో వన్డేకి ధోని దూరం!
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(60)తో కలిసి రోహిత్ శర్మ (62) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ జోడీ రెండో వికెట్కి అభేద్యంగా 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. వన్డేల్లో రోహిత్-కోహ్లీ జోడి వందకు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది 16వసారి.
భారత్ తరుపున సచిన్-గంగూలీల జోడీ 26 సెంచరీ భాగస్వామ్యాలతో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ క్రమంలో జట్టు స్కోరు 152 పరుగుల వద్ద 29వ ఓవర్లో సాంట్నర్ బౌలింగ్లో రోహిత్(62) ఔటయ్యాడు. ఆ తర్వాత బౌండరీలతో చెలరేగుతూ 59 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
వన్డేల్లో కోహ్లీకి ఇది 49వ హాఫ్ సెంచరీ. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ(3/41), భువనేశ్వర్ కుమార్(2/46), హార్డిక్ పాండ్యా(2/45), యజువేంద్ర చాహల్(2/51) విజృంభించారు.