32 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ
భారత్ తరుపున ఇప్పటివరకు 52 టెస్టు మ్యాచ్లకు సారథ్యం వహించిన కోహ్లీ 4,968 పరుగులు చేశాడు. మరో 32 పరుగులు చేస్తే టెస్టుల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న కెప్టెన్ల జాబితాలో చేరతాడు. అంతేకాదు భారత్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా నిలుస్తాడు.
ఐదువేల పరుగుల మైలురాయిని
అలాగే, అంతర్జాతీయ క్రికెట్లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో కెప్టెన్గా నిలుస్తాడు. ఈ జాబితాలో గ్రేమ్ స్మిత్(8,659) అగ్రస్థానంలో ఉండగా అలెన్ బోర్డర్(6,623), రికీ పాంటింగ్(6,542), క్లైవ్ లాయిడ్(5,233), స్టీఫెన్ ఫ్లెమింగ్(5,156)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
తొలి టెస్టులో డకౌట్
రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ డకౌటైన సంగతి తెలిసిందే. రెండు బంతులు మాత్రమే ఆడి పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. కోహ్లీ విఫలమైనప్పటికీ తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ రాణించడంతో భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కెప్టెన్గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
Captain | Games | Innings | Runs | |
1 | Graeme Smith | 109 | 193 | 8659 |
2 | Allan Border | 93 | 154 | 6623 |
3 | Ricky Ponting | 77 | 140 | 6542 |
4 | Clive Lloyd | 74 | 111 | 5233 |
5 | Stephen Fleming | 80 | 80 | 5156 |
6 | Virat Kohli | 52 | 85 | 4968 |