అది మ్యాచ్ వరకే పరమితమంటూ
మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన పైనె అది కేవలం మ్యాచ్లో భాగంగా జరిగిందేనని దాని గురించి మర్చిపోయానని చెప్పాడు. టిమ్తో పాటు కోహ్లీ కూడా వ్యక్తిగత దూషణలకు దిగనంత వరకూ దానిని హద్దుమీరలేదనే చెప్పాలి. ఇది కేవలం కవ్వింపు చర్య మాత్రమే. అని కొట్టిపరేశాడు. ఇప్పుడు టిమ్పైన్ ఇందుకు భిన్నంగా స్పందించాడు. వారిద్దరి వివాదం గురించి సోమవారం మీడియాతో మాట్లాడాడు.
నాకెలాంటి కోపమూ లేదు
‘పెర్త్ వేదికగా మొదలైన మా ఇద్దరి మధ్య గొడవను చాలా వరకూ ఆస్వాదించా. కోహ్లీని ఎప్పట్నుంచో గమనిస్తున్నా. అతడి ఆటతీరు నాకెంతో ఇష్టం. ఇప్పుడు అలాంటి వ్యక్తితోనే కెప్టెన్గా తలపడుతున్నా. కోహ్లీ షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు స్పందించిన తీరుపై నాకెలాంటి కోపం లేదు. అందరి కెప్టెన్లలాగే కోహ్లీ కూడా ఆలోచిస్తున్నాడు. ఆటకు ప్రాణం పెడుతున్నాడు. అందరిలా తను కూడా ఓటమిని ఒప్పుకోడు.
కోహ్లీని మెచ్చుకోకుండా ఉండలేను
మ్యాచ్ గెలవాలన్న కసి అతడిలో ఎక్కువ కనిపిస్తుంది. కోహ్లీలో ఉండే ఆ లక్షణమే నాకిష్టం. కోహ్లీ వ్యక్తిగతంగా నాకు తెలీదు. ఆటలో అతడి దూకుడు, ఆటతీరు, క్రికెట్ నైపుణ్యాలను మెచ్చుకోకుండా ఉండలేను. అందువల్లే అందరూ కోహ్లీని ఇష్టపడతారనుకుంటా. అందుకే కోహ్లీకి అభిమానులు ఎక్కువని నా అభిప్రాయం' అని కోహ్లీపై పైన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
మెల్బౌర్న్ వేదికగా మూడో టెస్టులో
మరో రెండు రోజుల్లో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. మెల్బౌర్న్ మైదానం ఈ మ్యాచ్కు వేదిక కానుంది. పెర్త్ మాదిరిగానే ఈ స్టేడియంలో కూడా పచ్చిక ఉండేలా చర్యలు తీసుకున్నట్లు క్యూరేటర్ తెలిపాడు. మూడో టెస్టుకు భారత జట్టులో కీలకమార్పులు చోటుచేసుకోనున్నాయి.