టీమిండియాకు ఆ అంకె మాత్రం నిరాశనే
300 పైచిలుకు విజయలక్ష్యాన్ని చాలా జట్లు అనేక సందర్భాల్లో చేధించినప్పటికీ.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఆ స్కోరు సాధిస్తే సగం విజయం సాధించేశామన్న ధీమాతో ఉంటాయి. భారత్ కూడా చాలాసార్లు 300కు పైగా స్కోరు సాధించి కొన్నిసార్లు గెలిచింది.. మరికొన్నిసార్లు ఓడింది. అయితే టీమిండియాకు ఓ అంకె మాత్రం ఎప్పుడూ నిరాశనే మిగుల్చుతోంది.
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ టైగా
అదే 321. వన్డేల్లో భారత్ ఈ స్కోరును గతంలో రెండు సార్లు సైతం పరాజయం పాలైంది. బుధవారం విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్లోనూ భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులే చేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ టైగా ముగిసింది. భారీస్కోరు సాధించినా విజయం సాధించకపోవడం భారత అభిమానుల్లో నిరాశ నింపింది. దీంతో టీమిండియాకు 321 స్కోరు అచ్చిరాదని అభిమానులు అనుకుంటున్నారు.
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 2007లోనూ:
2007లో ఛండీగడ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్ల 9 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్(99) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. అనంతరం బరిలోకి దిగిన పాక్.. యూనిస్ ఖాన్(117) అద్భుత సెంచరీతో మరో బంతి మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
48.4 ఓవర్లలో 322 పరుగులు సాధించి విజయం
2017లో ఓవల్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(125) సెంచరీకి తోడు రోహిత్ శర్మ(78), ధోనీ(63) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక 48.4 ఓవర్లలో 322 పరుగులు సాధించి విజయం సాధించింది.