|
ధోనీ దేశభక్తి:
ప్రపంచకప్లో భాగంగా టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికాతో తోలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో ప్రొటీస్ ఆటగాడు ఫెలుక్వాయోను స్టంపౌట్ చేయడం ద్వారా గ్లౌజ్పై ఉన్న లోగో అభిమానుల కంట పడింది. భారత సైన్యానికి చెందిన బలిదాన్ గుర్తు ఉన్న గ్లౌజులు ధోనీ ధరించడంతో సామాజిక మాధ్యమాల్లో అతడిపై ప్రశంసల జల్లు కురిసింది. ధోనీ దేశభక్తిని అభిమానులు మెచ్చుకున్నారు.
లోగో తీయించండి:
మరోవైపు ధోనీ లోగోపై ఐసీసీ మాత్రం అభ్యన్తరం వ్యక్తం చేసింది. ధోనీ గ్లౌజులపై బలిదాన్ గుర్తు క్రికెట్ నిబంధనలకు విరుద్ధం. ఆ గుర్తు తొలగించాలని ఐసీసీ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ జీఎం క్లైర్ ఫోర్లాంగ్ బీసీసీఐని కోరారు. 'ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్ సామాగ్రిపై.. జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరాం' అని ఫర్లాంగ్ వెల్లడించారు.
చర్యలు తీసుకోలేదు:
కాగా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ధోనీకి శిక్ష విధిస్తారా అని ఫర్లాంగ్ను అడగ్గా.. 'మొదటి ఉల్లంఘన కాబట్టి కేవలం గుర్తు తొలగించాలని కోరాం. చర్యలు తీసుకోలేదు' అని ఫోర్లాంగ్ తెలిపారు. ఐసీసీ నిబంధనలతో ఇకపై.. వచ్చే మ్యాచ్లలో ధోనీ బలిదాన్ గుర్తు గ్లౌజ్లు వాడడు. టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడునుంది.
ధోనీకి లెఫ్టినెంట్ కల్నల్ హోదా:
ఇంతకుముందు కూడా ధోనీ ఆర్మీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో.. ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లకి ఆర్మీ క్యాపులు అందించాడు. ఆ మ్యాచ్లో ఆటగాళ్లు ఆ క్యాపులు ధరించే ఆడారు. 2011లో ధోనీకి లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కింది. ఆ సమయంలో అతను ఆగ్రాలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఈ ట్రైనింగ్లో భాగంగా ధోనీ ఐదు సార్లు పారాచూట్ డైవింగ్ కూడా చేశాడట.