చికాగోలో నివసిస్తోన్న చాచా
పాకిస్తాన్కు చెందిన చాచా చికాగోలో నివసిస్తున్నారు. ప్రస్తుతం నిదాహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకలో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో మహ్మద్ బషీర్ అకా (చికాగో చాచా), భారత అభిమాని సుధీర్, బంగ్లా అభిమాని షోయబ్ అలీలతో కలిసి మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంలో తనకు ధోనీ అంటే ఎందుకు అంత ఇష్టమో వెల్లడించాడు.
భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు లేవని చెప్పారు
‘2011 వరల్డ్ కప్లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మొహాలీ వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం నేను పాకిస్థాన్ నుంచి రెండు రోజులు ముందుగానే అక్కడి వచ్చా. టిక్కెట్ కోసమని మైదానం వద్దకు వెళ్లగా టికెట్లు లేవని చెప్పారు. దీంతో నేను తీవ్ర నిరాశ చెందాను. తిరిగి వెళ్లిపోదామని అనుకున్న నాలో మ్యాచ్ ఎలాగైనా చూడాలన్న బలమైన కోరిక అలాగే ఉండటంతో మరొక్కసారి ప్రయత్నించడంలో తప్పు లేదనుకున్నాను' అని అన్నాడు.
అప్పటివరకు ధోని అంటే ఎవరో తెలియదు
'అందుకే తర్వాతి రోజు మరోసారి స్టేడియానికి వచ్చాను. నాకు మ్యాచ్ చూడాలని ఉందని ప్లకార్డు ప్రదర్శించాను. ఓ వ్యక్తి టికెట్స్ ఉన్న కవర్ తీసుకొచ్చి ఇస్తూ.. ఈ టికెట్లు ధోని పంపించాడని తెలిపాడు. నిజంగా అప్పటికి ధోని ఎవరో కూడా నాకు తెలియదు. ఆ టికెట్స్తో మ్యాచ్ను ఆస్వాదించాను. కానీ, అప్పటి నుంచి మాత్రం నాకు ధోనీ అంటే చాలా ఇష్టం. ఎంతంటే.. నా భార్య కంటే కూడా నాకు ఎక్కువగా ధోనీనే ఇష్ట పడుతున్నాను' అని తెలిపారు.
భారత్ శత్రుదేశం అని యువకులకు నూరిపోశారు
ఆ క్షణం నుంచి భారత్ మ్యాచ్లు చూస్తూనే ఉన్నానని నవ్వుతూ చెప్పాడు. ‘అయితే చాలా మంది భారత్కు ఎందుకు మద్దతిస్తున్నావని అడిగుతుంటారు. వారందరికీ నేను ఒకటే సమాధానమిస్తా. అదేంటంటే.. ఇండియాలో మనకు కావాల్సినంత ప్రేమ దొరుకుతుంది. కానీ, మా దేశంలో వృద్ధులంతా భారత్ శత్రుదేశం అని యువకులకు నూరిపోశారు. కానీ, అందులో నిజం లేదు' అని చాచా పేర్కొన్నాడు.