58 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి:
దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్ను ఆసీస్ జట్టు 3-1 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. జోహాన్నెస్బర్గ్లో జరిగిన నాలుగో టెస్టులో 492 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చిత్తయింది. 1960 దశకం తర్వాత ఆసీస్పై సఫారీ జట్టు టెస్టు సిరీస్ విజయం సాధించడం ఇదే తొలిసారి.
ప్రపంచ శక్తిగా ఎదగాలంటే:
ఈ సిరీస్కు ముందు భారత్తో తలపడిన మూడు టెస్టులలోనూ రెండింటిని కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆటతీరుపై స్పందించాడు షేన్ వార్న్. ‘ఆస్ట్రేలియా జట్టు మరోసారి ప్రపంచ శక్తిగా ఎదగాలంటే సరైన వ్యక్తులు రంగంలోకి దిగాల్సిన అవసరముంది. ఇప్పుడు కొత్తవారికి ఆటతోపాటు క్రికెట్ నాయకత్వంలోనూ అవకాశాలు ఉన్నాయి. (బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో) అన్ని హోదాల్లో ఉన్నవారు ప్రమాదంలో పడ్డారు. పెద్ద తలకాయలు దిగిపోవాల్సింది' అని విశ్లేషించాడు.
కోచ్తోపాటు బ్యాటింగ్ కోచ్లు కూడా:
దక్షిణాఫ్రికా సిరీస్ ఓటమి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్, టీమ్ మేనేజర్ ప్యాట్ హోవార్డ్ తమ పదవుల నుంచి దిగిపోవాల్సిందేనన్నాడట. ఈ విషయాన్ని పరోక్షంగా వార్న్ పేర్కొన్నట్టు ఫాక్స్ స్పోర్ట్స్ అనే ప్రముఖ క్రీడా మాధ్యమం తెలిపింది. కోచ్తోపాటు బ్యాటింగ్ కోచ్లు కూడా బాధ్యత వహించాలని, ఇంకెప్పుడు ఒక మంచి బ్యాట్స్మన్ను జట్టుకు అందిస్తారని ప్రశ్నించారు.
వ్యక్తిగత విచారణ జరగాలని:
ఇదిలా ఉంచితే, బాల్ ట్యాంపరింగ్ విషయంలో జట్టుకు సంబంధించిన అధికారుల నుంచి ఆటగాళ్ల వరకు వ్యక్తిగత విచారణ అనేది జరగాలని ఆస్ట్రేలియన్ క్రికెటర్ అసోసియేషన్ పేర్కొంది. అసోసియేషన్ అధికారి గ్రెగ్ డెయ్యర్ మాట్లాడుతూ.. నాయకత్వం నుంచే అన్నీ అలవడతాయి. అధికారుల ఆమోదం లేకుండా తప్పులు జరిగాయని అనుకోను. కాబట్టి కేప్టౌన్లో జరిగిన టెస్ట్పై వ్యక్తిగత విచారణ చేయాలని పిలుపునిచ్చారు.