హైదరాబాద్: డే-నైట్ టెస్టు మ్యాచ్లను వీక్షించే సువర్ణావకాశం భారత అభిమానులకు త్వరలోనే రానుంది. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సౌరవ్ గంగూలీ బోర్డులోని ప్రతి సభ్యుడితో ఈ విషయమై చర్చించటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. టెస్ట్ క్రికెట్ యొక్క దీర్ఘకాలిక భవిష్యత్తు డే-నైట్ టెస్టులేనని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.
2018-19 బోర్డర్-గవాస్కర్ సిరిస్లో భాగంగా ఈ ఏడాది జనవరిలో అడిలైడ్ వేదికగా డే-నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించాలని ఆస్ట్రేలియా బోర్డు ప్రయత్నాలు చేసినప్పటికీ బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించలేదు. అయితే, గంగూలీ ఆధ్వర్యంలోని కొత్త పాలన వారి తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆలోచనకు అంగీకరించవచ్చు.
India vs South Africa: రాంచీ టెస్టుకు ముందు సఫారీలకు ఊహించని ఎదురుదెబ్బ!
వచ్చే వేసవిలో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "దీని గురించి ఆలోచిస్తాం. మేము దీనిపై ఎలా పని చేస్తాం అనే దానిపై ఇప్పుడే మాట్లాడితే తొందరపాటు అవుతుంది. ముందు నన్ను పదవిని చేపట్టనివ్వండి. ఆ తర్వాత ప్రతి సభ్యుడితో చర్చిస్తాం" అని అన్నాడు.
"ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో డే-నైట్ టెస్టులు ఉన్నాయి ఎందుకంటే అడిలైడ్ మైదానం పింక్-బాల్ టెస్టులకు ఆతిథ్యమిస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో డే-నైట్ టెస్టులు ఉండవని చెప్పడం సరైన పిలుపు అని నేను అనుకోవడం లేదు. డే-నైట్ టెస్టులు ముందుకు సాగాలి. ప్రతి ఒక్క జట్టు కూడా డే-నైట్ టెస్టులు ఆడాలి. టెస్టు క్రికెట్కు అదే భవిష్యత్తు" అని గంగూలీ తెలిపాడు.
మోడీజీ-ఇమ్రాన్ ఖాన్ను అడగండి: భారత్-పాక్ ద్వైపాక్షిక సిరిస్పై గంగూలీ
"టీమిండియా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. డే-నైట్ టెస్టు మ్యాచ్లను తప్పక గెలుస్తుంది. పగటిపూట టెస్టులకు డే-నైట్ టెస్టులకు పెద్ద తేడా ఉండదు. బంతి మాత్రమే తేడా. క్లాస్ ప్లేయర్లు ఉన్నారు... వారు తప్పకుండా డే-నైట్ టస్టుల్లో టీమిండియాను గెలిపిస్తారు" అని సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.