|
మూడో ఫాస్ట్ బౌలర్ కోసం
ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో మూడు సెంచరీలు బాది ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా ఎంపికైన కోహ్లి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ "జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్లకి తోడుగా జట్టులోకి మూడో ఫాస్ట్ బౌలర్ కోసం గత కొంతకాలంగా వెతుకుతున్నాం" అని అన్నాడు.
నెం.4 స్థానాన్ని అంబటి రాయుడు చక్కగా భర్తీ చేశాడు
"వరల్డ్ కప్ ముంగిట ఆ స్థానానికి తాను సరిపోతానని ఖలీల్ అహ్మద్ నిరూపించాడు. అలానే బ్యాటింగ్ ఆర్డర్లో నెం.4 స్థానాన్ని అంబటి రాయుడు చక్కగా భర్తీ చేశాడు. ఈ రెండు స్థానాల కోసమే గత కొంతకాలంగా సరైన ఆటగాళ్ల కోసం టీమిండియా నిరీక్షించింది. ఒక్క సిరీస్లోనే అవి రెండూ భర్తీ కావడంతో చాలా సంతోషంగా ఉంది" అని కోహ్లీ తెలిపాడు.
31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్
ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో రోహిత్ శర్మ (63 నాటౌట్: 56 బంతుల్లో 5 ఫోర్లు, 4సిక్సులు), విరాట్ కోహ్లి (33 నాటౌట్: 29 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు.
3-1తో సిరిస్ను చేజిక్కించుకున్న కోహ్లీసేన
ఓపెనర్ శిఖర్ ధావన్(6) తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ రోహిత్-కోహ్లిల జోడి మరో వికెట్ పడకుండా ఆడి భారత్కు భారత్ జట్టు 14.5 ఓవర్లలోనే విజయాన్ని అందించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్లో ఈ సిరీస్ని భారత్ జట్టు 3-1తో చేజిక్కించుకోగా విశాఖపట్నం వేదికగా ముగిసిన రెండో వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే.