న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాయుడు, ఖలీల్ మా నిరీక్షణకు తెరదించారు: విరాట్ కోహ్లీ

Ambati Rayudu and Khaleel Ahmed have helped India tick all boxes, says Virat Kohli after 3-1 series win

హైదరాబాద్: వరల్డ్‌కప్‌కు ముందే టీమిండియాకు ఇద్దరు నాణ్యమైన ఆటగాళ్లు దొరికారని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా గురువారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

<strong>5వ వన్డేలో సరదా సన్నివేశం!: రోహిత్ వెనక్కిరా? అన్న కోహ్లీ</strong>5వ వన్డేలో సరదా సన్నివేశం!: రోహిత్ వెనక్కిరా? అన్న కోహ్లీ

దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను టీమిండియా 3-1తో సొంతం చేసుకుంది. ఆఖరి వన్డేలో వెస్టిండిస్ నిర్దేశించిన 105 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఆడుతూ పాడుతూ 14.5 ఓవర్లకే ఛేదించింది. ఈ సిరిస్‌లో ఒక మ్యాచ్‌ టైగా ముగిసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు విండిస్ 31.5 ఓవర్లకు 104 పరుగులకు ఆలౌటైంది.

1
44270

మూడో ఫాస్ట్ బౌలర్‌ కోసం

ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో మూడు సెంచరీలు బాది ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌'గా ఎంపికైన కోహ్లి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ "జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌‌‌లకి తోడుగా జట్టులోకి మూడో ఫాస్ట్ బౌలర్‌ కోసం గత కొంతకాలంగా వెతుకుతున్నాం" అని అన్నాడు.

నెం.4 స్థానాన్ని అంబటి రాయుడు చక్కగా భర్తీ చేశాడు

నెం.4 స్థానాన్ని అంబటి రాయుడు చక్కగా భర్తీ చేశాడు

"వరల్డ్ కప్ ముంగిట ఆ స్థానానికి తాను సరిపోతానని ఖలీల్ అహ్మద్ నిరూపించాడు. అలానే బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4 స్థానాన్ని అంబటి రాయుడు చక్కగా భర్తీ చేశాడు. ఈ రెండు స్థానాల కోసమే గత కొంతకాలంగా సరైన ఆటగాళ్ల కోసం టీమిండియా నిరీక్షించింది. ఒక్క సిరీస్‌లోనే అవి రెండూ భర్తీ కావడంతో చాలా సంతోషంగా ఉంది" అని కోహ్లీ తెలిపాడు.

31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్

31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్

ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో రోహిత్ శర్మ (63 నాటౌట్: 56 బంతుల్లో 5 ఫోర్లు, 4సిక్సులు), విరాట్ కోహ్లి (33 నాటౌట్: 29 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు.

3-1తో సిరిస్‌ను చేజిక్కించుకున్న కోహ్లీసేన

3-1తో సిరిస్‌ను చేజిక్కించుకున్న కోహ్లీసేన

ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(6) తొందరగా పెవిలియన్‌ చేరినప్పటికీ రోహిత్‌-కోహ్లిల జోడి మరో వికెట్‌ పడకుండా ఆడి భారత్‌కు భారత్ జట్టు 14.5 ఓవర్లలోనే విజయాన్ని అందించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో ఈ సిరీస్‌ని భారత్ జట్టు 3-1తో చేజిక్కించుకోగా విశాఖపట్నం వేదికగా ముగిసిన రెండో వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, November 1, 2018, 19:14 [IST]
Other articles published on Nov 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X