హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత క్రీడాకారులు నిరాశపరుస్తున్నారు. స్వర్ణ పతకం ఖాయమనుకున్న క్రీడలో ఒకటైన కబడ్డీలో భారత్కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఆసియా గేమ్స్లో డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగిన భారత మహిళల కబడ్డీ జట్టు ఫైనల్స్లో ఓటమిపాలైంది.
శుక్రవారం ఇరాన్తో జరిగిన ఫైనల్లో భారత మహిళల కబడ్డీ జట్టు 24-27 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో భారత్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే పురుషుల జట్టు సెమీస్లో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకోగా.. తాజాగా మహిళల జట్టు ఫైనల్లో నిరాశ పరచడం విశేషం.
#TeamIndia at the #AsianGames2018
— Team India (@ioaindia) August 24, 2018
Iranian Women's Kabaddi team showed that they are made of nerves of steel, to topple the undefeated #AsianGames champions of Kabaddi. Indian Women's Kabaddi team suffers a shocker loss at the hands of Iran, to settle for Silver.#IAmTeamIndia pic.twitter.com/7HOgCRlkLQ
ఈ మ్యాచ్లో తొలుత ఇరాన్పై 6-2తో ఆధిపత్యం సాధించింది. ఆట తొలి అర్ధభాగం పూర్తయ్యే సరికి భారత్ 13-11తో ముందంజలో ఉంది. ఆ తర్వాత ఇరాన్ అద్భుతంగా పుంజుకుంది. వరుసగా పాయింట్లు సాధిస్తూ 17-13తో భారత్పై పైచేయి సాధించింది. ఆ తర్వాత భారత్ను ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది.
చివరికి 27-24 పాయింట్లతో ఓటమి చవిచూసింది. దీంతో స్వర్ణం సాధిస్తుందనుకున్న భారత మహిళల కబడ్డీ రజతంతో సరిపెట్టుకుంది. తాజా పతకంతో ఆసియా గేమ్స్లో భారత్ పతకాల సంఖ్య 24కు చేరింది. ప్రస్తుతం భారత ఖాతాలో 5 స్వర్ణ, 5 రజత, 14 కాంస్య పతకాలు ఉన్నాయి.