హైదరాబాద్: ధర్మశాల వేదికగా సోమవారం జరిగిన దేవ్ధర్ ట్రోఫీలో కర్ణాటక శుభారంభం చేసింది. సమర్థ్ (117) సెంచరీ సాధించడంతో దేవధర్ ట్రోఫీలో కర్ణాటక 6 పరుగుల తేడాతో భారత్-బిపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది.
R Samarth celebrates as he posts the first century of @paytm #DeodharyTrophy 2017-18 pic.twitter.com/6k9FPsJ4al
— BCCI Domestic (@BCCIdomestic) March 5, 2018
మయాంక్ అగర్వాల్ (44), దేశ్పాండే (46) కూడా రాణించారు. ఛేదనలో శ్రేయస్ గోపాల్ (3/29), కృష్ణ (2/45) ధాటికి భారత్-బి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 290 పరుగులకు పరిమితమైంది. మనోజ్ తివారి (120) సెంచరీ చేసినప్పటికీ జట్టును గెలిపించలేక పోయాడు.
.@tiwarymanoj celebrates his century for India B against Karnataka in @paytm #DeodharTrophy 2017-18 #IndBvKAR pic.twitter.com/9dt8ed78r3
— BCCI Domestic (@BCCIdomestic) March 5, 2018
ఛేదనలో 'భారత్-బి' జట్టు 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో భారత్-బి విజయానికి 6 బంతుల్లో 11 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో సిద్దేశ్ లాడ్ (70) దూకుడుగా ఆడుతున్నాడు. చివరి ఓవర్ వేసేందుకు ఆఫ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ బంతినందుకున్నాడు.
ఈ స్థితిలో 'బి' జట్టే గెలిచేలా కనిపిచింది. కానీ గౌతమ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లాడ్ను ఔట్ చేయడంతో పాటు నాలుగు పరుగులిచ్చాడు. దీంతో సోమవారం జరిగిన దేవధర్ ట్రోఫీ వన్డే మ్యాచ్లో కర్ణాటక 6 పరుగులతో నెగ్గింది. కర్ణాకట బౌలర్ శ్రేయాస్ గోపాల్ 3 వికెట్లు తీశాడు.
WATCH highlights of R Samarth's determined 117-run knock to lift Karnataka to a solid total in @paytm #DeodharTrophy against India B - https://t.co/FV7NmsRiwc
— BCCI Domestic (@BCCIdomestic) March 5, 2018