For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లోక్‌సభలో జాతీయ క్రీడా బిల్లు.. అందులో ఏమున్నాయంటే?

Sports Governance Bill: కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం లోక్‌సభలో జాతీయ క్రీడా పరిపాలనా బిల్లు, జాతీయ డోపింగ్ వ్యతిరేక(సవరణ) బిల్లు 2025లను ప్రవేశపెట్టారు. భారతీయ క్రీడలలో పారదర్శకత, జవాబుదారీతనం, మెరుగైన పరిపాలన దిశగా ఇది కీలకమైన అడుగుగా చెప్పబడుతోంది. ఈ బిల్లులోని ముఖ్యాంశాలలో జాతీయ క్రీడా బోర్డు(NSB) ఏర్పాటుకు సంబంధించిన నిబంధన కూడా ఉంది. దీని పరిధిలోకి అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలు వస్తాయి. క్రీడా సంఘాలకు గుర్తింపు ఇవ్వడం, గుర్తింపు రద్దు చేయడం, నిధులు ఇవ్వడం వంటి అన్ని పనులను జాతీయ క్రీడా బోర్డు చేస్తుంది.ఇప్పటివరకు జాతీయ స్థాయి క్రీడా సంస్థలకు భారత ఒలింపిక్ సంఘం గుర్తింపు ఇచ్చేది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(BCCI) కూడా ఈ బిల్లు పరిధిలోకి వస్తుంది. బీసీసీఐ ప్రభుత్వాల నుంచి ఎటువంటి నిధులను స్వీకరించదు. ప్రభుత్వం నుంచి తాము నిధులు పొందట్లేదు కాబట్టి ఆర్టీఐ తమకు వర్తించకూడదని బీసీసీఐ వాదిస్తోంది.

క్రీడా బిల్లులోని ముఖ్యాంశాలు
ఈ బిల్లులో క్రీడా సంస్థల గుర్తింపు, నియంత్రణ కోసం జాతీయ క్రీడా బోర్డును ప్రతిపాదించారు. తద్వారా క్రీడా పరిపాలనలో స్థిరత్వం, వృత్తి నైపుణ్యం వస్తాయి.

*వివాదాలను త్వరగా పరిష్కరించడానికి క్రీడా ట్రిబ్యునల్ ఏర్పాటును ప్రతిపాదించారు. దీనితో సివిల్ కోర్టులపై ఆధారపడటం తగ్గుతుంది. అలాగే కేసుల పరిష్కారం కూడా త్వరగా జరుగుతుంది. దీనికి సివిల్ కోర్టుల అధికారులు ఉంటాయి. ఈ ట్రిబ్యునల్ ఎంపిక నుంచి ఎన్నికల వరకు, క్రీడా సమాఖ్యలు, ఆటగాళ్లకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తుంది. ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో మాత్రమే సవాలు చేయవచ్చు.

National Sports Governance Bill 2025 Introduced in Lok Sabha Key Highlights Inside

*ఈ బిల్లులో పరిపాలనా సమస్యల కోసం అనుభవజ్ఞులైన క్రీడా నిర్వాహకులను నియమించడానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. దీనితో కోర్టుల ద్వారా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను నిర్వాహకులుగా నియమించే పద్ధతి ముగుస్తుంది.

*క్రీడా సమాఖ్యల ఎన్నికల నిర్వహణను జాతీయ క్రీడా ఎన్నికల ప్యానెల్ నిర్వహిస్తుంది. ఇందులో నిష్పక్షపాతమైన, తక్కువ ఖర్చుతో కూడిన, పారదర్శకమైన ప్రక్రియను నిర్ధారించడానికి ఎన్నికల నిర్వహణలో అనుభవజ్ఞులైన అధికారులు ఉంటారు.

*క్రీడా సమాఖ్యల సాధారణ సభ, కార్యనిర్వాహక కమిటీ రెండింటిలోనూ ఆటగాళ్ల ప్రాతినిధ్యాన్ని తప్పనిసరి చేశారు. తద్వారా పరిపాలనలో ఆటగాళ్లకు ప్రాధాన్యత లభిస్తుంది.

*ఈ బిల్లులో జాతీయ క్రీడా సంస్థల కార్యనిర్వాహక కమిటీలో కనీసం నలుగురు మహిళలు ఉంటారని నిబంధన చేర్చబడింది.

*అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారుల కోసం స్పష్టమైన వయో పరిమితి, పదవీ కాల పరిమితిని నిర్ణయించారు.దీనతో చాలా కాలంగా కొనసాగుతున్న చట్టపరమైన వివాదాలు, గందరగోళం ముగుస్తుంది.

*అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయి యూనిట్లు జాతీయ క్రీడా బోర్డుతో నమోదు చేసుకోవాలి. తద్వారా జవాబుదారీతనం పెరుగుతుంది.

*ప్రతి సమాఖ్యలో వివాద పరిష్కార కమిటీలను ఏర్పాటు చేయాలి. తద్వారా అంతర్గత క్రమశిక్షణ నిర్ధారించబడుతుంది. పదేపదే జరిగే గొడవలు తగ్గుతాయి.

*అథ్లెట్లను.. ముఖ్యంగా మైనర్, మహిళా అథ్లెట్లను దుర్వినియోగం లేదా వేధింపుల నుంచి రక్షించడానికి ప్రస్తుత చట్టానికి మించి సురక్షితమైన క్రీడా విధానంను ప్రవేశపెట్టారు.

*ఈ బిల్లు నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, విశ్వసనీయతను మెరుగుపరచడానికి ఆర్థిక పర్యవేక్షణ, సమ్మతి అవసరాలను అమలు చేస్తుంది.

జాతీయ క్రీడా బోర్డు

జాతీయ క్రీడా బోర్డు (NSB)కు ఒక అధ్యక్షుడు ఉంటారు. దాని సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ నియామకాలు ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా జరుగుతాయి. ఎంపిక కమిటీలో కేబినెట్ కార్యదర్శి లేదా క్రీడా కార్యదర్శి అధ్యక్షుడిగా, భారత క్రీడా ప్రాధికార సంస్థ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) డైరెక్టర్ జనరల్, ఇద్దరు క్రీడా నిర్వాహకులు (జాతీయ క్రీడా సంస్థకు అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా లేదా కోశాధికారిగా పనిచేసిన వారు)ద్రోణాచార్య, ఖేల్ రత్న లేదా అర్జున అవార్డు గ్రహీత అయిన ఒక ప్రముఖ క్రీడాకారుడు ఉంటారు.

బీసీసీఐ కూడా ప్రభుత్వ పరిధిలోకి..
బీసీసీఐ కూడా జాతీయ క్రీడా పరిపాలనా బిల్లులో భాగంగా ఉంటుంది. బీసీసీఐ ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆధారపడకపోయినా, అది ప్రతిపాదిత జాతీయ క్రీడా బోర్డు నుంచి గుర్తింపు పొందవలసి ఉంటుంది. బీసీసీఐ ఇతర అన్ని జాతీయ క్రీడా సమాఖ్యల (NSF) వలె స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా కొనసాగుతుంది. అయితే దానికి సంబంధించిన వివాదాలను ప్రతిపాదిత జాతీయ క్రీడా ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. ఏ ఎన్‌ఎస్‌ఎఫ్‌పైనైనా ప్రభుత్వ నియంత్రణ ఈ బిల్లు ఉద్దేశ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. సుపరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వం ఒక సహాయక పాత్ర పోషిస్తుంది. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో 20-20 క్రికెట్ ఫార్మాట్‌ను చేర్చారు. ఈ విధంగా బీసీసీఐ ఇప్పటికే ఒలింపిక్ ఉద్యమంలో భాగమైంది.

జాతీయ డోపింగ్ సవరణ బిల్లు
క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం లోక్‌సభలో జాతీయ డోపింగ్ వ్యతిరేక సవరణ బిల్లు, 2025ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో జాతీయ డోపింగ్ వ్యతిరేక చట్టం, 2022లో ప్రపంచ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ (వాడా) సూచనల ప్రకారం సవరణలు ఉన్నాయి. ఈ చట్టం మొదట 2022లో ఆమోదించబడింది, అయితే ప్రపంచ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ (వాడా) అభ్యంతరాల కారణంగా దాని అమలును నిలిపివేయవలసి వచ్చింది. క్రీడలలో జాతీయ డోపింగ్ వ్యతిరేక బోర్డు ఏర్పాటుపై ప్రపంచ సంస్థ అభ్యంతరం తెలిపింది, దీనికి డోపింగ్ వ్యతిరేక నిబంధనల కోసం ప్రభుత్వానికి సిఫార్సులు చేసే అధికారాలు కల్పించాలని ప్రతిపాదించబడింది. ఈ బోర్డులో ఒక అధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సభ్యులు ఉంటారని ప్రతిపాదించబడింది. జాతీయ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ (నాడా)ను పర్యవేక్షించే, దానికి ఆదేశాలు ఇచ్చే నిబంధన కూడా ప్రతిపాదించబడింది. వాడా దీనిని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలో ప్రభుత్వ జోక్యం అని పేర్కొంటూ తిరస్కరించింది. సవరించిన బిల్లులో బోర్డు నిబంధనను ఉంచారు, అయితే దానికి నాడాను పర్యవేక్షించే లేదా సలహా ఇచ్చే అధికారం ఉండదు.

Story first published: Thursday, July 24, 2025, 8:23 [IST]
Other articles published on Jul 24, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+