న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాప్ స్టోరీస్: క్రికెట్ ప్రపంచంలో తాజా వార్తల వివరాలు

Top Stories: Things that made news in the cricket world today

హైదరాబాద్: మూడో టెస్టు విజయం తర్వాత నాలుగో టెస్టుకు టీమిండియాలో మార్పులు.. మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి టీ 20 ఫార్మాట్‌కు వీడ్కోలు తెలిపింది. కోహ్లీ, స్మిత్‌ల కంటే హనుమ విహారీనే టాప్ స్థానంలో ఉన్నాడు. ఎంఎస్ ధోనీతో పాటు విరాట్ కోహ్లీ కేరళ బాధితులకు సాయం చేసేందుకు చేయి కలిపాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత మహిళా జట్టును బీసీసీఐ ప్రకటించింది.

నాలుగో టెస్టుకు టీమిండియాలో కీలక మార్పులు:

నాలుగో టెస్టుకు టీమిండియాలో కీలక మార్పులు:

సుదీర్ఘ పర్యటనలో ఆఖరిదైన టెస్టు సిరీస్‌లో టీమిండియా మూడో టెస్టు విజయంతో ముగించింది. అయినా నాలుగో టెస్టుకు కీలక మార్పులు చేసి పద్దెనిమిదేళ్ల పృథ్వీ షాకు, హనుమ విహారీకి స్థానం కల్పించింది.

నాలుగో టెస్టుకు టీమిండియాలో కీలక మార్పులు:

పేసర్ జులన్ గోస్వామి ఇక నుంచి ఐసీసీ వరల్డ్ టీ20కి వీడ్కోలు:

పేసర్ జులన్ గోస్వామి ఇక నుంచి ఐసీసీ వరల్డ్ టీ20కి వీడ్కోలు:

భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి ఇక నుంచి ఐసీసీ వరల్డ్ టీ20(షార్ట్ ఫార్మాట్) నుంచి తప్పుకోనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. భారత్ తరపున గోస్వామి 68 టీ20ల్లో ఆడి 56 వికెట్లు పడగొట్టింది.

ఇక నుంచి ఐసీసీ వరల్డ్ టీ20కి వీడ్కోలు:

నాలుగో టెస్టుకు టీమిండియాతో తలపడనున్న జట్టు ఇదే:

నాలుగో టెస్టుకు టీమిండియాతో తలపడనున్న జట్టు ఇదే:

నాలుగో టెస్టులో భారత్‌తో తలపడే ఇంగ్లాండ్ జట్టుని సెలక్టర్లు గురువారం ప్రకటించారు. నాలుగో టెస్టు కోసం ప్రకటించిన జట్టులో స్థానికి ఆటగాడు జేమ్స్ విన్సీ చోటు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య ఆగస్టు 30 నుంచి సౌతాంప్టన్ వేదికగా నాలుగో టెస్టు ఆరంభం కానుంది.

టీమిండియాతో తలపడనున్న జట్టు ఇదే:

కోహ్లీ.. స్మిత్‌ల కంటే హనుమ విహారీనే టాప్:

కోహ్లీ.. స్మిత్‌ల కంటే హనుమ విహారీనే టాప్:

స్టీవ్ స్మిత్ (57.27), కోహ్లి, పుజారా లాంటి క్రికెటర్ల యావరేజ్ కంటే కూడా విహారీ సగటే ఎక్కువ. 2016-17 సీజన్‌ నుంచి విహారి ఆంధ్ర తరఫున ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద ఇద్దరు స్పిన్నర్లు అవసరం లేదనే ఆలోచనతో కుల్దీప్‌ను పక్కనబెట్టి.. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన హనుమ విహారికి అవకాశం కల్పించారు.

కోహ్లీ.. స్మిత్‌ల కంటే హనుమ విహారీనే

కత్రినా కైఫ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని పాకిస్థాన్ కెప్టెన్:

కత్రినా కైఫ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని పాకిస్థాన్ కెప్టెన్:

బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ అన్నాడు. తాజాగా, ఓ ఇంటర్యూలో పాల్గొన్న సర్ఫరాజ్ అహ్మద్ పలు ఆసక్తికరమైన అంశాలను అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో ఇష్టమైన బాలీవుడ్‌ నటి ఎవరన్న ప్రశ్నకు గాను కత్రినా కైఫ్‌ అని బదులిచ్చాడు.

కత్రినా కైఫ్‌ అంటే తనకు ఎంతో..

శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత మహిళల జట్టు

శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత మహిళల జట్టు

శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత మహిళల జట్టుని బీసీసీఐ మహిళ సెలక్షన్ కమిటీ వెల్లడించింది. సెప్టెంబర్ 11 నుంచి ఈ పర్యటన ప్రారంభకానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరిస్ ఆడనుంది. వన్డే జట్టు కెప్టెన్‌గా మిథాలీ రాజ్, టీ-20 జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరించనున్నారు.

పర్యటనకు వెళ్లే భారత మహిళల జట్టు

Story first published: Friday, August 24, 2018, 14:19 [IST]
Other articles published on Aug 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X