ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం..
ఈ చైనా దాష్టికానికి బుద్ది చెప్పాలని భారత ప్రజలు భావిస్తున్న నేపథ్యంతో చైనీస్ స్పోర్ట్స్ పరికరాల ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహ్తా గురువారం స్పష్టం చేశారు. ‘మా కిట్ స్పాన్సర్ లీనింగ్తో టోక్యో ఒలింపిక్స్ వరకూ అగ్రిమెంట్ ఉంది. అయితే మాకు దేశమే ముఖ్యం. ఒకవేళ లీనింగ్తో ఒప్పందం రద్దు చేసుకోవాలని సభ్యులు భావిస్తే.. జనరల్ హౌజ్ నిర్ణయం తీసుకుంటుంది.'అని తెలిపారు.
భారతీయులపై మండిపడిన పోర్న్ స్టార్గా మహిళా రేసర్!
చైనా కంపెనీల వల్ల మనకే లాభం..
ఇక భారత క్రికెట్కు బంగారు బాతులాంటి ఐపీఎల్ను చైనా కంపెనీ అయిన వివో స్పాన్సర్షిప్ చేస్తోంది. మరోవైపు టీమిండియా ప్రధాన స్పాన్సర్గా ఇటీవలి వరకు మరో చైనా కంపెనీ ‘ఒప్పో' వ్యవహరించగా... ఇప్పుడున్న బైజూస్లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలతో అనుబంధం కొనసాగించడంపై వస్తున్న ప్రశ్నలకు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ సమాధానమిచ్చారు. ‘వివో' వల్లే మనకే లాభం తప్ప చైనాకు కాదని ఆయన స్పష్టం చేశారు.
అందుకే కెప్టెన్గా సచిన్ విఫలమయ్యాడు: భారత మాజీ కోచ్
భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోదు..
బోర్డు భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోదని, వాస్తవాలు చూడాలని ఆయన అన్నారు. ‘ఇప్పుడంతా భావోద్వేగంతో స్పందిస్తున్నారు. దీన్ని పక్కనబెట్టి యథార్థంగా ఆలోచించండి. చైనా కంపెనీలకు మద్దతు ఇస్తున్నామా లేక అక్కడి నుంచి రాబడి అందుకుంటున్నామా అనే తేడా తెలుస్తుంది. చైనా కంపెనీల ఉత్పత్తుల్ని భారత్లో విక్రయించేందుకు అనుమతిస్తే మన వినియోగంతో వారికి డబ్బు వెళ్తుంది.
రూ. 440 కోట్లు చెల్లిస్తుంది..
అదే చైనా కంపెనీ వారి బ్రాండ్ ప్రమోషన్ కోసం మనకు చెల్లిస్తే అక్కడి నుంచి రాబడి వస్తుంది.అంటే భారత ఆర్థిక రంగానికి ఇది లాభించేది! ఎలాగంటే టైటిల్ స్పాన్సర్ కోసం వివో కంపెనీ బీసీసీఐకి సాలీనా రూ. 440 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో 42 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. అంటే ఇది ఆర్థికంగా మనకు మేలు చేసే అంశమే' అని వివరించారు. ఒక వేళ మనం వద్దనుకుంటే ఆ మొత్తం చైనాకు తరలిపోతుందన్నారు.