తెలంగాణ కుర్రాడి విధ్వంసం.. 47 బంతుల్లోనే శతకం!
తెలంగాణ టీ20 ప్రీమియర్ లీగ్(టీజీ20) టోర్నీలో మరో శతకం నమోదైంది. అనురాగ్ నల్గొండ నైట్స్ ఓపెనర్, హైదరాబాద్ కుర్రాడు గౌరవ్ రెడ్డి(47 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్లతో 101 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. టీ20ల్లో గౌరవ్ రెడ్డికి ఇదే తొలి సెంచరీ. శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా మెదక్ ఫాల్కన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గౌరవ్ రెడ్డి ఈ ఫీట్ సాధించాడు. అతని సెంచరీ ధాటికి అనురాగ్ నల్గొండ నైట్స్ 8 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్ను ఓడించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. విక్రమ్ నాయక్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48 నాటౌట్), వరుణ్ ఎర్రమ్(29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 44 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రుంజిత్ రెడ్డి(30), రవి తేజ(33) దూకుడుగా ఆడారు. నల్గొండ బౌలర్లలో రక్షణ్ రెడ్డి, అనికేత్ రెడ్డి, ఇయాన్ సతని తలో వికెట్ తీసారు.

అనంతరం అనురాగ్ నల్గొండ నైట్స్ 16.3 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గౌరవ్ రెడ్డితో పాటు జశ్వత్ మోతే(34), కెప్టెన్ రాహుల్ బుద్ది(20 నాటౌట్) రాణించారు. మెదక్ ఫాల్కన్స్ బౌలర్లలో మధుకర్ మన్నె, అర్జున్ గొర్రపల్లి తలో వికెట్ తీసారు.
ఈ టోర్నీలో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన అనురాగ్ నల్గొండ నైట్స్ 4 విజయాలతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు మెదక్ ఫాల్కన్స్ వరుసగా 5 మ్యాచ్ల్లో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. తిలక్ వర్మ సారథ్యంలో తొలి మ్యాచ్లో గెలిచిన మెదక్ ఫాల్కన్స్.. ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.
తిలక్ శతకంతో ఆ జట్టుకు అద్బుతమైన ఆరంభం అందించినా.. అతని గైర్హాజరీలో మెదక్ బలహీనంగా మారిపోయింది. 5 మ్యాచ్లకు 5 గెలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 10 పాయింట్స్తో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. ఐదు మ్యాచ్ల్లో మూడేసి విజయాలు సాధించిన కరీం నగర్, రంగారెడ్డి, ఖమ్మం వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించనుండగా.. జులై 12న జరిగే ఫైనల్తో ఈ టోర్నీకి తెరపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

