అప్పుడు నాకు ఇలానే చేశారు.. రోహిత్కు ఆ భావన కలిగించొద్దు: అశ్విన్
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా స్పందించాడు. కెరీర్ చివరి దశలో ఉన్న సీనియర్ ఆటగాళ్లతో భారత జట్టు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశాడు.
భారత జట్టుకు తన అవసరం లేదనే భావనను రోహిత్ శర్మకు కలిగించవద్దని సెలెక్టర్లను కోరాడు. ఒక ఆటగాడు తనకంటూ ఒక వారసత్వాన్ని నిర్మించుకున్న జట్టులో.. తనను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన కంటే దారుణమైన అనుభూతి మరొకటి ఉండదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
రోహిత్ రిటైర్మెంట్ అంటూ..
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమైన రోహిత్ శర్మను వన్డే ప్రపంచకప్ 2027 ప్రణాళికల నుంచి తప్పించారని, సెలెక్టర్లు ఈ విషయాన్ని అతనికి తెలియజేశారని వార్తలు వచ్చాయి. లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే రోహిత్కు ఆఖరి మ్యాచ్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను బీసీసీఐ ఖండించింది. రోహిత్ జట్టులోనే కొనసాగుతాడని స్పష్టం చేసింది.

అప్పుడు నాకు ఇలానే చేశారు..
రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్..టీమిండియా మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు. వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి రోహిత్ అవసరం లేదని భావించినప్పుడు, ఆ విషయాన్ని ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయానంతరమే అతనికి తెలియజేయాల్సిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. తాను కూడా ఇలానే ఇబ్బంది పడి జట్టుకు వీడ్కోలు పలకాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నాడు.
'నా విషయానికి వస్తే.. మేం బంగ్లాదేశ్తో సొంతగడ్డపై సిరీస్ ఆడాం. ఆ సిరీస్లో నేను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాను. న్యూజిలాండ్తో మేం సరిగ్గా ఆడలేదు. ఆ ఓటమికి నేను పూర్తి బాధ్యతను తీసుకుంటాను. ఆ తర్వాత మేం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్లాం. అయితే అక్కడ నేను ఉండటం టీమిండియా మేనేజ్మెంట్కు ఇష్టం లేదనిపించింది.
మనం నచ్చని వాళ్లతో ఉంటామా..?
ఒకసారి టీమ్ మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదని భావించడం మొదలుపెట్టాక ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చలేరు. రోహిత్, కోహ్లీ కూడా కూడా అలా భావిస్తే.. అత్యుత్తమ ప్రదర్శన చేయలేరు. రెండోది వారు ఆ జట్టులో కొనసాగలేరు. మీరు అంటే ఇష్టం లేని ఇంట్లో మీరు ఉండగలరా?'అని అశ్విన్ ప్రశ్నించాడు.
సౌతాఫ్రికా వంటి పిచ్ల్లో అనుభవం కలిగిన రోహిత్, కోహ్లీలు జట్టుకు ఎంతో అవసరం. అవును.. గత 8 మ్యాచ్ల్లో రోహిత్ ఫామ్ కాస్త తగ్గింది. సౌతాఫ్రికాలో విజయం సాధించాలంటే అనుభవం కలిగిన రోహిత్, కోహ్లీలు జట్టుకు ఎంతో అవసరం. వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి అవసరం లేదని భావించినప్పుడు.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే చెప్పాల్సింది.
ఆటగాళ్లకు సమాచారమివ్వాలి..
అయితే ఇది రెండు వైపులా కత్తిలాంటిదే. ఆటగాళ్లు ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో సంతోషంగా ఉండలేరు. ఆస్ట్రేలియాలో ఎవరైనా నా దగ్గరికి వచ్చి నీ అవసరం లేదని చెబితే నాకు కూడా కోపం వచ్చేది. కానీ ఆ తర్వాత కనీసం నాకు స్పష్టమైన సమాచారం ఇచ్చారని అర్థం చేసుకునేవాడిని. ఆట పరంగా ఇద్దరూ బాగానే ఆడుతున్నారు. కోహ్లీ అద్బుత ప్రదర్శన చేస్తుండగా.. రోహిత్ ప్రదర్శన యావరేజ్గా ఉంది.
అయితే ఇన్ని రోజులు ఏం చేశారు? మెగా టోర్నీకి 12 నెలల ముందు వారిని పక్కనపెట్టడం ఎందుకు? అనేదే నా ప్రశ్న. నాకు సూటిగా మాట్లాడటమే ఇష్టం. పరోక్ష సందేశాలతో పని చేయలేను. ఎవరైనా నా దగ్గరికి వచ్చి.. అశ్విన్, మా దగ్గర ఈ చిన్న పిల్లలు ఉన్నారు. నువ్వు వాళ్లకు శిక్షణ ఇవ్వాలి అని అంటే దాని అర్థం ఏంటి? జనాలకు మేం అవసరం లేదని భావించేలా చేయడమే కదా?'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

