Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ రోజుల్లో అది పెద్ద నేరం.. కోచ్‌లు ఏం చేస్తున్నారు: టీమిండియా మాజీ క్రికెటర్

ఇంగ్లండ్‌తో రెండో టీ20 ఓటమి నేపథ్యంలో టీమిండియా కోచింగ్ స్టాఫ్‌పై మాజీ స్పిన్నర్ మనిందర్ సింగ్ విమర్శలు గుప్పించాడు. ఆటగాళ్లు తప్పు చేస్తుంటే.. కోచ్‌లు ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు. యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ నోబాల్స్ కారణంగానే గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైందని మనిందర్ సింగ్ అభిప్రాయపడ్డాడు.

ఆ ఒక్క ఓవరే మా ఓటమిని శాసించింది: శ్రేయస్ అయ్యర్

ఆ ఒక్క ఓవరే మా ఓటమిని శాసించింది: శ్రేయస్ అయ్యర్

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 16వ ఓవర్‌ వరకు ఈ మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించింది. కానీ 17వ ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ రెండు నోబాల్స్‌తో సహా 29 పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. మరో ఓవర్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని కైవసం చేసుకుంది.

A No-Ball Crime Maninder Singh Blasts Ravi Bishnoi After Expensive 17th Over Costs India 2nd T20I vs England

తాజాగా ఈ మ్యాచ్‌ను విశ్లేషించిన మనిందర్ సింగ్.. రవి బిష్ణోయ్‌తో పాటు సపోర్ట్ స్టాప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ రోజుల్లో నోబాల్స్ వేయడం అతిపెద్ద నేరమని చెప్పుకొచ్చాడు. 'భారత్ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎందుకంటే 16వ ఓవర్‌ వరకు మ్యాచ్ భారత్ చేతిలోనే ఉంది. కానీ బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్‌తో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ ఓవర్‌లో బిష్ణోయ్ సైడ్ లైన్ టచ్ చేస్తూ.. రెండో నోబాల్స్ వేసాడు. ఇది చూశాక అతనికి సాయం చేయకుండా కోచింగ్ స్టాఫ్ ఏం చేస్తుందా? అనిపించింది.

IND vs ENG: కొంపముంచిన రవి బిష్ణోయ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన టీమిండియా!

IND vs ENG: కొంపముంచిన రవి బిష్ణోయ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన టీమిండియా!

నెట్స్‌లో బౌలర్లు ప్రాక్టీస్ చేసే సమయంలో బౌలింగ్ కోచ్ వారి బౌలింగ్ తీరు, పొజిషన్‌పై శ్రద్ద పెట్టడం లేదు. మ్యాచ్‌లో నోబాల్స్ వేసే అవకాశాలను పసిగట్టడం లేదు. ప్రస్తుత క్రికెట్‌లో నోబాల్ వేయడం అనేది అతిపెద్ద నేరం. రవి బిష్ణోయ్ 17వ ఓవర్‌లో ఇచ్చిన 29 పరుగుల కారణంగానే భారత జట్టు ఓటమిపాలైంది.'అని మనిందర్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఈ ఓటమితో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకంజలో నిలిచింది. మూడో టీ20 మంగళవారం రాత్రి 10 గంటలకు ప్రారంభం కానుంది.

Story first published: Monday, July 6, 2026, 19:20 [IST]
Other articles published on Jul 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+