ఇది ఐపీఎల్ కాదు.. టీమిండియా వైఫల్యంపై జోఫ్రా ఆర్చర్ సెటైర్స్
ఐపీఎల్ పిచ్లతో పోలిస్తే ఇంగ్లండ్ పరిస్థితులు బౌలర్లకు అనుకూలంగా ఉంటాయని స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అన్నాడు. భారత్లో చిన్న బౌండరీలు, బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే పిచ్ల వల్ల బౌలర్లకు తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండదని, ఇంగ్లండ్లో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని చెప్పాడు. ఇదే భారత బ్యాటర్లకు ఇబ్బందిగా మారిందని పరోక్షంగా వెల్లడించాడు.
ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా మంగళవారం రాత్రి ట్రెంట్ బ్రిడ్జ్లో వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఆర్చర్.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లండ్లో బౌలింగ్ ఈజీ..
'ఇంగ్లండ్లో బౌలింగ్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఐపీఎల్లో మాత్రం కొన్ని సందర్భాల్లో 200 పరుగులు కూడా సురక్షితం కాదు. కానీ ఇక్కడ బౌలర్లకు పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి. పిచ్ నుంచి బౌన్స్ లభిస్తుంది. రాంగ్ డెలివరీని కూడా కొన్నిసార్లు ఫీల్డర్లు రక్షించగలరు. భారత్లో బౌలర్లు ఎలాంటి చిన్న తప్పు చేసినా వెంటనే భారీ షాట్ల రూపంలో శిక్ష పడుతుంది. అందుకే అక్కడ బౌలింగ్ చేయడం కఠినంగా ఉంటుంది.

ఇంగ్లండ్ పిచ్లపై 200 పరుగులు సాధిస్తే విజయం దాదాపు ఖాయం. మా బౌలర్లు కొత్త బంతితో దాడి చేయగలిగారు. సరైన లైన్, లెంగ్త్ దొరికితే ఈ వికెట్పై వికెట్లు రావడం సహజం. ఐపీఎల్లో ఒక్కోసారి 200 పరుగులు చేసినా విజయం దక్కదు. కానీ ఇంగ్లండ్ పరిస్థితుల్లో బౌలర్లకు కాస్త వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది.’అని జోఫ్రా ఆర్చర్ చెప్పుకొచ్చాడు.
వైభవ్తో పోరు సమం..
రాజస్థాన్ రాయల్స్ జట్టులో తన సహచరుడైన 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో సాగుతున్న పోరుపై కూడా ఆర్చర్ స్పందించాడు. మాంచెస్టర్ మ్యాచ్లో తొలి బంతికే తనను సిక్సర్ కొట్టిన వైభవ్ను, ఈ మ్యాచ్లో ఆర్చర్ 13 పరుగుల వద్ద పెవిలియన్కు పంపాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య పోటీ సమంగా ఉందని ఆర్చర్ సరదాగా అన్నాడు. 'ఇప్పుడు ఇద్దరం సమానమే. ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. చివరికి ఎవరు మెరుగ్గా రాణిస్తారో చూద్దాం.’ అని నవ్వుతూ చెప్పాడు.
భారత్ను దెబ్బతీసిన ఆర్చర్..
ఈ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. మరో పేసర్ జోష్ టంగ్ 38 పరుగులకు 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. ఈ ఇద్దరూ గంటకు 144 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి, పిచ్ నుంచి లభించిన అదనపు బౌన్స్ను చక్కగా ఉపయోగించుకున్నారు.
ఐర్లాండ్తో సిరీస్ ఓడిపోయిన శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు.. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో వెనుకంజలో నిలిచింది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. నాలుగో టీ20 మ్యాచ్ గురువారం బ్రిస్టల్లో జరగనుంది. ఈ సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

