అందుకే వైభవ్ సూర్యవంశీని తప్పించాం: శ్రేయస్ అయ్యర్
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తుది జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పాడు. వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్ .. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాన్ష్ షెడ్జే బరిలోకి దిగుతున్నాడని అయ్యర్ తెలిపాడు.
అందుకే బౌలింగ్ ఎంచుకున్నాం..
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. గత రెండు మ్యాచ్ల్లో మేం బౌలింగ్ చేసిన తీరును పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సిరీస్లో మేం అన్నీ విషయాలను ప్రయత్నించాం. ఈ రోజు గాలి ఎక్కువగా ఉండటంతో పాటు పిచ్ ఎక్కువగా మారదని చెప్పారు. దాంతోనే బౌలింగ్ ఎంచుకున్నాను. మైదానానికి ఆలస్యం రావడం వల్ల జట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ సిరీస్లో మేం అన్ని రకాల పరిస్థితులను చూశాం. కాబట్టి ఇది మాకు ఓ కొత్త సవాల్. కొత్త రోజు మాత్రమే. మేం ఈ సవాల్కు సిద్దంగా ఉన్నాం. మొత్తంగా ఈ సిరీస్ మాకు గొప్ప అవకాశం.

ఈ రోజు ఫలితం గురించి ఆలోచించకుండా 100 శాతం జట్టు కోసం మా ఆటగాళ్లు శ్రమించాలని కోరుకుంటున్నాను. మైదానంలోకి వెళ్లి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలనే ఆలోచనతో ఉండాలని భావిస్తున్నా. నిరాశ పడటం, త్వరగా చేతులెత్తేయడం కంటే... మా ఆటగాళ్లు వారికి వారు కాస్త సమయం ఇచ్చుకోవాలి. కాస్త రిలాక్స్ అవ్వడంతో పాటు ఊపిరి తీసుకోండి. ముఖ్యంగా ప్రస్తుత క్షణంలో ఉండంది. ఏం జరిగింది.. ఏం జరగబోతుందో అనే ఆలోచన వద్దు.
టీమ్ ఫ్యూచర్ కోసం..
మా జట్టులో రెండు మార్పులు చేశాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాన్ష్ షెడ్జ్, వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చారు. ఒక జట్టుగా భవిష్యత్తులో మాకు ఏది ఉత్తమమో దాన్నిప్రయత్నించడానికి ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. దాని ఆధారంగానే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అన్నాడు. ఈ రోజు మ్యాచ్ గెలిచి ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం అందుకోవడమే తమ లక్ష్యమని చెప్పాడు. గత మ్యాచ్ల తరహాలోనే పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఆడటం ముఖ్యమని తెలిపాడు. 150వ టీ20 మ్యాచ్ ఆడుతున్న ఆదిల్ రషీద్ తమకు ఎంతో విలువైన ఆటగాడని చెప్పాడు. అతని నైపుణ్యం, ప్రత్యర్థి ఆటగాళ్లను బోల్తా కొట్టించే వ్యూహాలు అద్భుతమైనవని, తమ జట్టులో ఉండటం సంతోషంగా ఉందని బ్రూక్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాన్ష్ షెడ్జ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ.
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, జాకోబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరణ్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

