Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC 2027 Final రేసు: శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రా.. భారత్ పరిస్థితి ఏంటంటే?

శ్రీలంకతో రెండో టెస్ట్‌లో టీమిండియాకు అనూహ్య ఫలితం ఎదురైంది. విజయం ఖాయమనుకున్న మ్యాచ్‌లో టీమిండియా పేలవ బౌలింగ్ ప్రదర్శనతో డ్రాకు తల వంచింది. గురువారం ముగిసిన ఈ టెస్ట్‌లో సోనాల్ దినుషా(264 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్) అజేయ శతకంతో శ్రీలంక గట్టెక్కింది. దాంతో ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.

229/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 154 ఓవర్లలో 429/9 స్కోర్ వద్ద డ్రా చేసింది. 18 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. ఈ మ్యాచ్ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 ఫైనల్ రేసులో భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.

IND vs SL: టీమిండియా కొంపముంచిన సోనాల్ దినుషా.. డ్రాతో గట్టెక్కిన శ్రీలంక!

IND vs SL: టీమిండియా కొంపముంచిన సోనాల్ దినుషా.. డ్రాతో గట్టెక్కిన శ్రీలంక!

భారత్ పరిస్థితి ఏంటంటే..?

ఈ మ్యాచ్ గెలిచి భారత్ 2-0తో సిరీస్ కైవసం చేసుకొని ఉంటే పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానానికి దూసుకొచ్చేది. కానీ ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత్ ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. టీమిండియా విజయాల శాతం 53.33 నుంచి 51.52కి పడిపోయింది.

How India vs Sri Lanka 2nd Test Draw Impacts India s WTC 2027 Qualification Chances

ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ ఓటమితో పాయింట్స్ టేబుల్‌లో ఎగబాకే అవకాశం రాగా.. భారత్ చేజార్చుకుంది. డబ్ల్యూటీసీ 2027 సైకిల్‌లో భారత్ ఇంకా ఏడు టెస్ట్‌లు ఆడాల్సి ఉంది. భారత్ ఫైనల్ చేరాలంటే మిగిలిన ఏడు టెస్ట్‌ల్లో ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏడు టెస్ట్‌లకు ఏడు గెలవాలి..

నవంబర్‌లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత్.. అక్కడ రెండు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ముందు ఆస్ట్రేలియాకు ఆతిథ్యమివ్వనున్న భారత్.. ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియాకు ఎదురైన అనూహ్య పరాజయంతో భారత్‌కు కొంత ఊరట లభించినప్పటికీ.. ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా శ్రమించాల్సిందే.

చరిత్ర సృష్టించిన సోనాల్ దినుషా.. 67 ఏళ్ల తర్వాత భారత్‌పై అరుదైన ఘనత!

Also Read

చరిత్ర సృష్టించిన సోనాల్ దినుషా.. 67 ఏళ్ల తర్వాత భారత్‌పై అరుదైన ఘనత!

మిగిలిన టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మిగిలిన ఏడు టెస్టుల్లో ప్రతి మ్యాచ్‌ను గెలిచేలా చూసుకోవాలి. అన్ని మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత్ PCT గణనీయంగా పెరుగుతుంది. మొత్తం ఏడు టెస్టుల్లో ఏడు విజయాలు ఉంటే భారత్ విజయాల శాతం 68.52 శాతానికి చేరుతుంది. అదే 6 విజయాలు, 2 ఓటములు అయితే విన్నింగ్ పర్సంటేజీ 62.96 శాతానికి పడిపోతుంది.

Story first published: Thursday, August 27, 2026, 18:17 [IST]
Other articles published on Aug 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+