ఇదే తొలిసారి కాదు..
‘సర్కస్ మొదలైందని మహేల చెబుతున్నాడు. ఈ విషయంలో వారిద్దరు ఎందుకు ఇంత అతిగా స్పందిస్తున్నారో నాకర్థం కావడం లేదు. పైగా నేను ఏ ఆటగాడి పేరు ప్రస్తావించలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి గతంలోనూ అర్జున రణతుంగ కూడా బహిరంగంగానే మాట్లాడారు. ఇదేమీ మొదటిసారి కాదు' అని మహిదానంద అన్నారు.
భారతీయులపై మండిపడిన పోర్న్ స్టార్గా మారిన మహిళా రేసర్!
అలా ఎలా?
మరోవైపు మహిదానంద వ్యాఖ్యలపై జయవర్ధనే మళ్లీ స్పందించాడు. ‘ప్రపంచకప్ ఫైనల్ను ఫిక్స్ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి' అంటూ ఈ మాజీ కెప్టెన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఇక ముంబై వేదికగా జరిగిన నాటి ఫైనల్లో జయవర్దనే(103) సెంచరీతో రాణించాడు.
విచారణకు ఆదేశం..
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఫిక్సింగ్లో ఆటగాళ్ల పాత్ర లేదని, కొన్ని పార్టీలు పాలుపంచుకున్నాయని మహిదానంద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిజానిజాలు తెలుసుకునేందుకు లంక ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి దుల్లాస్ అలాహప్పెరుమా సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. దర్యాప్తు ప్రగతిపై ప్రతి రెండు వారాలకొకసారి నివేదిక అందించాలని ఆదేశించారు.
చాలాసార్లు చావాలనుకున్నా.. తెలుసుంటే సుశాంత్తో మాట్లాడేవాడిని : షమీ
సర్కస్ మొదలైనట్లుంది..
మహిదానంద చేసిన ఆరోపణలను లంక దిగ్గజ ఆటగాళ్లు మహేళ జయవర్ధనె, కుమార సంగక్కర ట్విటర్ వేదికగా ఖండించిన విషయం తెలిసిందే. ఎన్నికల సర్కస్ మొదలైనట్లుందని, ఆధారాలు చూపించాలని జయవర్దనే వ్యంగ్యంగా ట్వీట్ చేయగా.. సాక్ష్యాధారాలను ఐసీసీకి అందజేయాలని సంగక్కర సూచించాడు. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. స్టార్ బ్యాట్స్మెన్ సెహ్వాగ్ (0), సచిన్ (18)ల వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ క్లిష్ట స్థితిలో గౌతమ్ గంభీర్(97) అద్భుత పోరాటానికి.. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఆరు వికెట్లతో టీమిండియా విజయం సాధించింది. మూడేళ్ల క్రితం శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా ఈ మ్యాచ్ ఫలితంపై సందేహం వ్యక్తం చేశాడు.