హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో సొంత ప్రేక్షకుల మధ్య విజయం సాధించాలని భావించిన తమిళ తలైవాస్కి నిరాశే ఎదురైంది. యు ముంబాతో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో తమిళ తలైవాస్ 24-29 తేడాతో ఓడిపోయింది. దీంతో సొంతగడ్డపై తమిళ్ తలైవాస్ ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేకపోయింది.
వరల్డ్ చాంపియన్షిప్: 36 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సాయి ప్రణీత్
ఫలితంగా ప్రో కబడ్డీ ఏడో సీజన్లో సొంతగడ్డపై విజయం సాధించని మూడో జట్టుగా నిలిచింది. అంతకముందు తెలుగు టైటాన్స్, పట్నా పైరెట్స్లు సైతం తమ సొంతగడ్డపై ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేకపోయాయి. ఈ ఓటమితో తమిళ తలైవాస్ పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోగా, ఐదో విజయంతో యు ముంబా నాలుగో స్థానానికి ఎగబాకింది.
తమిళ తలైవాస్ స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ఈ మ్యాచ్లో 14 సార్లు రైడ్కి వెళ్లి కేవలం 6 పాయింట్లు మాత్రే సాధించగా... డిఫెండర్ మోహిత్ చిల్లర్ ఆరు సార్లు ట్యాకిల్కి ప్రయత్నించి కేవలం మూడు పాయింట్లు మాత్రమే రాబట్టాడు. మరోవైపు యు ముంబా జట్టులో రైడర్ అతుల్ 7 రైడ్ పాయింట్లు సాధించగా.. డిఫెండర్ హరీందర్ 3 పాయింట్లతో మెరిశాడు.
PKL 2019: గులియా సూపర్-10, ఆరు ఓటముల తర్వాత విజయం
మరో మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 29-26తో పాట్నా పైరేట్స్పై గెలుపొందింది. జెయింట్స్ తరఫున రోహిత్ గులియా (10 పాయింట్లు) సూపర్-10 సాధించి ఫార్చూన్ జెయింట్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. పాట్నా తరఫున డుబ్కీ కింగ్ప్రదీప్ నర్వాల్ 9 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. శనివారం నుంచి ఢిల్లీ అంచె మ్యాచ్లు జరుగనున్నాయి.
ప్రొ కబడ్డీలో శనివారం
దబంగ్ ఢిల్లీ vs బెంగళూరు బుల్స్ (రాత్రి 7:30 నుంచి)
జైపుర్ పింక్ పాంథర్స్ vs తెలుగు టైటాన్స్ (రాత్రి 8:30 నుంచి)