
అఫ్రిది.. అంగీకరంచను..
‘గౌవరనీయులైన మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా బాధించాయి. బాధ్యాతాయుతమైన భారతీయుడిగా.. దేశం తరఫున ఆడిన ఆటగాడిగా అఫ్రిది.. ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం అంగీకరించను. మానవత్వం కోసం నీవు అడగ్గానే నా వంతు సాయం చేశా. కానీ మరోసారి చేయను'అని యూవీ ట్వీట్ చేశాడు.

లక్షమందితో సమానం..
అఫ్రిది వ్యాఖ్యలపై ధావన్ ఘాటుగా స్పందించాడు. ‘ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఈ సమయంలో కూడా కశ్మీర్ సమస్యను లేవనెత్తినందుకు సిగ్గుండాలి. కశ్మీర్ ఒకప్పుడు మాదే. ఇప్పుడూ మాదే. భవిష్యత్తులోనూ మాదే. 22కోట్ల మంది సైన్యాన్ని తీసుకొచ్చినా సరే. మా వాళ్లు ఒక్కొక్కరు లక్షమంది సైన్యంతో సమానం. మిగతా లెక్కలు మీరే చేసుకోండి'అని ధావన్ ట్వీట్ చేశాడు.

అఫ్రిదితో కటీఫ్..
అఫ్రిది చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, అవి ఏమాత్రం ఆహ్వానించదగినవు కావని హర్భజన్ ఇండియా టూడేతో మాట్లాడుతూ అన్నాడు. ‘మా దేశం గురించి, ప్రధాని గురించి అఫ్రిది చేసిన వ్యాఖ్యలు బాధించాయి. అతని కామెంట్స్ను తీవ్రంగా ఖండిస్తున్నా. అవి ఏమాత్రం ఆహ్వానించదగినవు కావు. అతను మా సహాయం కోరినప్పుడు మేము ఏదీ ఆలోచించకుండా ముందుకు వచ్చాము. మానవత్వంతో స్పందించాం. కరోనా వైరస్తో ఇబ్బంది పడుతున్నవారికి సాయం చేయాలని అలా చేశాం.
మా ప్రధాని కూడా కరోనా వైరస్కి దేశం, కులం, మతం ఏదీ లేదని చెప్పారు. కాబట్టి మేము సంక్షోభాన్ని అధిగమించేందుకే అఫ్రిదికి సాయంగా నిలిచాం. ఈ సంక్షోభంలో మా వంతు సహాయాన్ని మేము అందించాం. కానీ ఈ మనిషి(అఫ్రిది) మా దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే చెబుతున్నా.. అతనితో మాకెలాంటి సంబంధం లేదు. మా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు అతనికి ఏ మాత్రం లేదు. అతను తన హద్దుల్లో తన దేశంలో ఉంటే బాగుంటుంది' అని భజ్జీ ఫైర్ అయ్యాడు. ఇక అఫ్రిది ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వాలని హర్భజన్, యువరాజ్ సింగ్ భారత అభిమానులను కోరి విమర్శలపాలయ్యారు. అఫ్రిది తాజా వ్యాఖ్యలతో భారత నెటిజన్లు వీరిపై మరోసారి మండిపడుతున్నారు. మన డబ్బుతో మనకే ఎసరు పెడుతున్నాడని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు.

అఫ్రిది, ఇమ్రాన్, బాజ్వా జోకర్లు..
అఫ్రిది అనుచిత వ్యాఖ్యలపై గంభీర్ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నారని గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘పాకిస్థాన్కు 7 లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉందని అఫ్రిది 16 ఏళ్ల పిల్లాడిలా మాట్లాడుతున్నాడు. ఆ దేశం గత 70 ఏళ్లుగా కశ్మీర్ కోసం బిచ్చమెత్తుకుంటోంది. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ పాక్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. కానీ జడ్జ్మెంట్ డే వరకూ కశ్మీర్ పాక్కు దక్కదు. బంగ్లాదేశ్ గుర్తుంది కదా?' అని 1971 యుద్దాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ గంభీర్ ఘాటుగా ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications

కోహ్లీ పద్దతి మార్చుకో.. అతనేం వాటర్ బాయ్ కాదు: కైఫ్