రాహుల్ కీపింగ్ సూపర్..
ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సందర్భంగా రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడటంతో అనూహ్యంగా కీపింగ్ బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు. వికెట్ల వెనుకాల పంత్కు మించి అదరగొట్టాడు. కళ్లు చెదిరే స్టంపౌట్లు, క్యాచ్లతో లెజండరీ కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని గుర్తు చేశాడు. అటు బ్యాటింగ్లోను ఏ స్థానంలో పంపించినా ఇరగదీశాడు. ఇక ఈ సిరీస్ చివరి మ్యాచ్లో స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడటం.. అనంతరం కివీస్ టూర్కు దూరమవ్వడంతో టీమిండియా రాహుల్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
న్యూజిలాండ్ ప్రపంచకప్ ఫైనల్ చేరితే మేం సంతోషించాం : కోహ్లీ
|
అందుకే కోహ్లీ పట్టు..
ఎలాగో రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగడం అనివార్యం. కాబట్టి అతనికే కీపింగ్ బాధ్యతలు అప్పగించి అదనపు బ్యాట్స్మన్గా మనీష్ పాండేను జట్టులోకి తీసుకోవాలనేది కోహ్లీ వ్యూహం. టీ20ల్లో విజయాలు దక్కాలంటే టాపార్డర్తో పాటు లోయరార్డర్లో భారీ హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బ్యాట్స్మన్ అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కోహ్లీ.. సీనియర్లు వద్దన్నా రాహుల్కే కీపింగ్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నాడు.
ఈ వ్యూహంలో భాగంగానే స్పెషలిస్టు కీపర్ను జట్టులోకి తీసుకోవడానికి టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపడంలేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో మిడిలార్డర్ను బలోపేతం చేసే ఉద్దేశంతో పాండేకు అవకాశాలు ఇవ్వాలని చూస్తోంది. దీంతో శాంసన్, పంత్ బెంచ్కే పరిమితం కానున్నారు.
కీపర్గా రాహుల్ ప్రాక్టీస్
ఆస్ట్రేలియాతో చివరి వన్డే ముగిసిన రెండు రోజులకే కోహ్లీసేన న్యూజిలాండ్ చేరుకోవడంతో బుధవారం మొత్తం విశ్రాంతి తీసుకుంది. ఇక గురువారం ప్రాక్టీస్లో పాల్గొంది. ఈ ప్రాక్టీస్ సెషన్లో కేఎల్ రాహుల్ కీపింగ్ చేశాడు. కోచ్ల సమక్షంలో మెళకువలు నేర్చుకున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ పేసర్ నవదీప్ సైనీ వేసిన బంతులను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను‘రాహుల్.. కీపింగ్ గ్లౌవ్స్ సిద్ధం చేసుకున్నావా?' అనే క్యాప్షన్తో బీసీసీఐ ట్వీట్ చేసింది.
వారెవ్వా ఏం క్యాచ్.. అచ్చం చేపపిల్లలానే డైవ్(వీడియో)
రాహుల్ జట్టు మనిషి..
‘ఇక రాహుల్ అటు కీపర్గా బ్యాట్స్మెన్గా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతన్ని కీపర్గా కొనసాగిస్తే జట్టులోకి అదనపు బ్యాట్స్మెన్ తీసుకోవచ్చు. జట్టు కూడా సమతూకంగా ఉంటుంది. ఇక ఈ విషయంలో బయట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం నాకు తెలుసు. రాహుల్ను కీపర్గా కొనసాగిస్తే ఇతర ఆటగాళ్ల భవిష్యత్తు ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ మాకు జట్టు అవసరం, సమతూకమే ముఖ్యం. రాహుల్ పూర్తిగా జట్టు మనిషి'అని మీడియా సమావేశంలో కోహ్లీ చెప్పిన మాటలు, బీసీసీఐ ట్వీట్ చూస్తే తొలి టీ20లో రాహులే కీపరనే విషయం అర్థమవుతోంది.