
ప్రతీ మ్యాచ్ ముఖ్యమే..
సిరీస్ కోల్పోయినా చివరి మ్యాచ్ ముఖ్యమేనని తెలిపాడు. ఈ మ్యాచ్లో తామేంటో నిరూపిస్తామని, ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్చగా ఆడుతామని ఠాకుర్ తెలిపాడు. ‘ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. 0-2తో వెనుకబడినంత మాత్రాన ఫైనల్ మ్యాచ్కు ఇంపార్టెన్స్ లేదని భావించడంలో అర్థం లేదు. ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్ కీలకమే. మేం 0-2తో సిరీస్ కోల్పోయినా.. మా సత్తా ఏంటో నిరూపిస్తాం. స్వేచ్చగా ఆడుతాం'అని ఠాకుర్ చెప్పుకొచ్చాడు.

టేలర్ బ్యాటింగ్ అద్భుతం..
గత రెండు వన్డేల్లో సెంచరీ, హాఫసెంచరీతో అదరగొట్టిన రాస్ టేలర్ న్యూజిలాండ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఐదు టీ20 సిరీస్లో కూడా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఠాకుర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాస్ టేలర్ అద్భుతంగా ఆడుతున్నాడని, దేవుడిలా న్యూజిలాండ్ జట్టుకు విజయాలందిస్తున్నాడని కొనియాడాడు.
‘రాస్ బ్యాటింగ్ అద్భుతం. అతను క్రీజులోకి వచ్చిన తర్వాత లెగ్సైడ్ దేవుడిలా ఆడగలడు. గత రెండు వన్డేల్లోనూ అతన్ని త్వరగా ఔట్ చేసే వచ్చాయి. కానీ మేం ఆ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాం. ఆరంభంలోనే అతన్ని ఔట్ చేయడం చాలా ముఖ్యం.'అని ఠాకూర్ చెప్పుకొచ్చాడు.
మా వాళ్లు కొంచెం ఓవర్ చేశారు.. మా జట్టు తరఫున క్షమాపణలు చెబుతున్నా : బంగ్లా అండర్-19 కెప్టెన్

సైనీ దెబ్బకు ఠాకుర్ డౌటే..
తొలి వన్డేలో ఠాకుర్ దారుణంగా విఫలమైనా.. పక్కకు పెట్టాలని మాజీ క్రికెటర్లు సూచించినా.. లోయరార్డర్లో బ్యాటింగ్ చేయగలడనే ఒకే ఒక్క కారణంతో కెప్టెన్ కోహ్లీ అతనికి రెండో వన్డేలో అవకాశం ఇచ్చాడు. అతను కూడా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. బౌలింగ్లోనూ అద్భుతంగా రాణించి బ్యాటింగ్లో మెరిసాడు. అయితే రెండో వన్డేలో యువ పేసర్ నవ్దీప్ సైనీ బ్యాటింగ్లో అదరగొట్టి గెలుపు ఆశలు రేకిత్తించడంతో ఠాకుర్ అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే జట్టులో భారీ మార్పులు ఉంటాయని కెప్టెన్ కోహ్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఠాకుర్ బెంచ్కే పరిమితయ్యే అవకాశాలున్నాయి. ఒక వేళ బుమ్రా, షమీలలో ఏ ఒక్కరిపై వేటు పడినా ఠాకుర్ తుది జట్టులో ఉండొచ్చు.


Click it and Unblock the Notifications












