
గర్వంగా ఉంది..
‘నేను ఈ గొప్ప పనిలో భాగం అవుతున్నందుకు గర్వపడుతున్నా. దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు సాయంగా ‘వైజ్' సంస్థ ద్వారా నాకు వచ్చే ఆదాయాన్ని విరాళంగా ప్రకటిస్తున్నా. క్రీడాకారులకు మీ ప్రేమ ఆదరాభిమానాలే పెద్ద ఆస్తి. కానీ ఈ కరోనా విపత్కర కాలంలో కోవిడ్-19 వారియర్సే నిజమైన హీరోలు. వారు వాళ్ల ప్రాణాలను రిస్క్లో పెట్టి మరీ ఇతరులను కాపాడుతున్నారు. వైజ్తో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉంది'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కరోనా విరాళం@ రూ. 3 కోట్లు
కరోనా వైరస్ కట్టడికి తమవంతుగా పీఎం కేర్స్కు విరాళాన్ని ప్రకటించిన విరుష్కా జోడీ.. ఎంత సాయం చేశారనే విషయం మాత్రం ప్రకటించలేదు. అయితే మహారాష్ట్ర సీఎం నిధికి, పీఎంకేర్స్కు కలిపి రూ.3 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారని వారి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ముంబై పోలీసుల సంక్షేమానికి కూడా ఈ జోడీ విరాళాన్ని ప్రకటించింది. చెరో రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షల రూపాయాలను ముంబై పోలీస్ సంక్షేమానికి విరాళంగా ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ విషయాన్ని అప్పట్లో ముంబై పోలీస్ ట్విటర్ వేదికగా తెలియజేస్తూ.. విరుష్కా జోడీకి కృతజ్ఞతలు తెలిపింది.

ముమ్మర ప్రాక్టీస్..
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోహ్లీ.. నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న భారత ఆటగాళ్లు.. ప్రాక్టీస్ చేసే వెసులు బాటు ఇవ్వడంతో ముమ్మరంగా సాధన చేస్తున్నారు. అయితే విరాట్ నాలుగు టెస్ట్ల సిరీస్ ఫస్ట్ టెస్ట్ మాత్రమే ఆడనున్నాడు. ఆ తర్వాత పెటర్నీటీ లీవ్పై భారత్కు తిరిగి రానున్నాడు. జనవరిలో విరాట్ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఓ బిడ్డకు జన్మనివ్వనుంది.
ట్రోలింగ్ దెబ్బకు యూటర్న్..కోహ్లీని కొనియాడుతూ సూర్యకుమార్ యాదవ్ ట్వీట్..బిత్తరపోయిన రోహిత్ ఫ్యాన్స్


Click it and Unblock the Notifications
