3-0తో భారత్ గెలుపు..
పాకిస్థాన్తో జరిగిన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప(50), మహేంద్ర సింగ్ ధోనీ(33) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. అనంతరం జరిగిన బౌల్ ఔట్లో భారత్ 3-0తో గెలిచింది. టీమిండియా తరఫున సెహ్వాగ్, ఊతప్ప, హర్భజన్ బౌలింగ్ చేసి పాయింట్లు సాధించగా.. పాక్ తరఫున ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిది, యాసిర్ అరాఫత్ విఫలమయ్యారు.
ప్రాక్టీస్లో ఓ అంచనాకు వచ్చి..
అయితే ఆ మెగాటోర్నీలో ఈ పరిస్థితి వస్తుందని ముందే ఊహించి దానికి తగ్గట్టు ఆటగాళ్లను సిద్దం చేశామని నాటి బౌలింగ్ కోచ్, భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ తెలిపాడు. మ్యాచ్ టై అయితే బౌల్ ఔట్ పద్దతిని ఉపయోగిస్తారని ఆటగాళ్లను ఆ దిశగా శిక్షణనిచ్చానన్నాడు. ముఖ్యంగా నాన్ రెగ్యూలర్ బౌలర్లు సెహ్వాగ్, ఊతప్పతో ప్రాక్టీస్ చేయించి ఎవరు స్థిరంగా వికెట్లు తీయగలుగుతున్నారనే ఓ అంచనాకు వచ్చానని తెలిపాడు.
తీరా ఫస్ట్ మ్యాచ్లోనే ఆ పరిస్థితి రావడంతో సెహ్వాగ్, ఊతప్ప, భజ్జీలతో బౌలింగ్ చేయించాలని ధోనీని ఒప్పించానన్నాడు. తాజాగా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్ ప్రసాద్ టీ20 ప్రపంచకప్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ముందే తెలుసు..
‘ప్రపంచకప్ టోర్నీకి వెళ్లే ముందే పొట్టి ఫార్మాట్ నిబంధనలను తెలుసుకున్నాం. మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ఉండదని, బౌల్ ఔట్ ఉంటుందని తెలుసు. దాంతో మేం తరుచూ బౌల్ ఔట్ ప్రాక్టీస్ చేసేవాళ్లం. నెట్స్లో బ్యాట్స్మెన్, బౌలర్ల మధ్య ఈ విధానంలో పోటీ పెట్టేవాళ్లం. ఎక్కువగా ధోనీ, సెహ్వాగ్, ఊతప్ప వంటి బ్యాట్స్మెనే అద్భుతంగా రాణించేవారు. వారు నెట్స్లో బౌల్ ఔట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను వారి వెనుకాలే ఉండి ఎవరెవరూ స్థిరంగా వికెట్లను హిట్ చేస్తున్నారా? అని గమనించేవాడిని.
అస్సలు ఊహించలేదు..
అప్పుడు సెహ్వాగ్, ఊతప్ప, హర్భజన్ అద్భుతంగా హిట్ చేయడం చూశా. కానీ మా తొలి మ్యాచ్లోనే బౌల్-ఔట్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరం ఊహించలేకపోయాం. అది చాలా టైట్ గేమ్. బౌల్ ఔట్లో ఏ ఆటగాళ్లతో బౌలింగ్ చేయించాలో ధోనీని సులువుగా ఒప్పించాను. మేం మా అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాం. స్లో బౌలర్లు శరీరాన్ని సమన్వయం చేసుకోగలరని, నేరుగా వికెట్లకు బంతి హిట్ చేయగలరనే నమ్మకంతో సెహ్వాగ్, ఊతప్పలకు అవకాశం ఇచ్చాం.'అని వెంకటేశ్ ప్రసాద్ తెలిపాడు.
ఆరోజు సచిన్ అలా చేయకుంటే సెహ్వాగ్ ఇంత సక్సెస్ సాధించేవాడు కాదు