కోహ్లీ ఓ అసాధారణ కెప్టెన్..
‘విరాట్ కోహ్లీ ఓ అసాధారణ కెప్టెన్. ధృడసంకల్పం కలిగిన వ్యక్తి. ఓటమి నుంచి ఎలా పుంజుకోవాలో కోహ్లికి అతని ప్లేయర్లకు బాగా తెలుసు. ఎలాంటి అవకాశాన్ని వదులుకోడు. అది బెంగళూరు వేదికగా ప్రత్యర్థి 300 లోపు లక్ష్యాన్ని నిర్ధేశిస్తే.. రోహిత్, ధావన్, అయ్యర్, రాహుల్ వంటి మేటీ ఆటగాళ్లున్న జట్టు ఛేదనను అడ్డుకోవాలనుకోవడం వృథా ప్రయాసే.'అని షోయబ్ తెలిపాడు.
ఆఖరి వన్డేలో ఆసీస్ చిత్తు.. భారత్దే సిరీస్
ఇది పరువు పోరు..
‘ఈ సిరీస్ ఇరు జట్ల మధ్య జరిగిన ఆత్మగౌరవ పోరు. ప్రస్తుత టీమ్ నేనాడినప్పటి ఇండియా కాదు. పూర్తిగా విభిన్నం. తొలి మ్యాచ్ ఓడిన తర్వాత సిరీస్ గెలవడం చాలా కష్టం. కానీ కోహ్లీసే అదరగొట్టింది'అని స్పీడ్ స్టార్ చెప్పుకొచ్చాడు.
రోహిత్ను ఆపడం కష్టం..
‘ఒకసారి రోహిత్ టచ్లోకి వచ్చాడంటే అది మంచి బంతా.. చెడ్డ బంతా అనే ఆలోచనే ఉండదు. ఎలాంటి బంతినైనా బౌండరీకి తరలిస్తాడు. అంత సహసిద్దంగా చెలరేగుతాడు. చిన్నస్వామి స్టేడియం అంటే మరింత రెచ్చిపోతాడు. మొత్తానికి ఇరుజట్లు మంచి క్రికెట్ ఆడాయి. అభిమానులకు కావాల్సిన మజానిచ్చాయి.'అని ఈ పాక్ మాజీ క్రికెటర్ తెలిపాడు.
ఇక రోహిత్ శర్మ(128 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 119) అద్భుత శతకంతో అదరగొట్టగా.. కెప్టెన్ కోహ్లీ(91 బంతుల్లో 8 ఫోర్లతో 89) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్తో 44 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో డిసైడర్ వన్డేలో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1తో సొంతం చేసుకొని గతేడాది కోల్పోయిన సిరీస్కు ప్రతీకారం తీర్చుకుంది