
కరోనాను ఎదుర్కొంటాం..
అయితే మరోవైపు ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, ఈ క్యాష్రిచ్లీగ్కు కరోనాతో వచ్చే ముప్పే లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్కు రంగం సిద్ధమైందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే స్వయంగా ప్రకటించాడు. కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా తీసుకోవాల్సిన అన్ని రక్షణ చర్యలను బీసీసీఐ తీసుకుంటుందని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు తెలిపాడు.
‘ఐపీఎల్ 2020 సీజన్కు రంగం సిద్ధమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా బీసీసీఐ తీసుకోవాల్సిన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటుంది.'అని ఈ మహమ్మారిని బోర్డు ఎలా ఎదుర్కోబోతుందనే ప్రశ్నకు దాదా సమాధానంగా చెప్పుకొచ్చాడు.
ఆడకుండా ఫైనల్ చేరడం కంటే.. ఓడిపోవడమే మంచిది: సౌతాఫ్రికా కెప్టెన్

నో షేక్ హ్యాండ్.. నో సెల్ఫీస్..
ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా బీసీసీఐ.. ‘నో షేక్ హ్యాండ్.. నో సెల్ఫీస్'అనే పద్దతిని కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం.. అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం వాటిని రద్దు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. అలాగే మ్యాచ్లు సందర్భంగా ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు ఎలా మెదులుకోవాలనే విషయంలో ఓ గైడ్లైన్స్ రూపొందించనుందని తెలుస్తోంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నైసూపర్ కింగ్స్ మధ్య వాంఖడే మైదానం వేదికగా మార్చి 29న జరిగే తొలి మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది.

ఐసీసీ లీగ్ మ్యాచ్లు వాయిదా
కోవిడ్ వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మలేషియా వేదికగా జరగాల్సిన సీడబ్ల్యూసి ఛాలెంజ్ లీగ్ మ్యాచ్లను వాయిదా వేసింది. కెనడా, డెన్మార్క్, మలేషియా, కటార్, సింగపూర్, వనౌటు పాల్గొనల్సిన ఈ 11 రోజుల ఈవెంట్ని ఈ ఏడాదిలో కొన్ని నెలల తర్వాత నిర్వహిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దీంతో పాటు థాయ్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే మధ్య జరగాల్సిన టీ-20 సిరీస్ను కూడా రద్దు చేశారు. అంతేకాక.. నేపాల్ ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్ని కూడా రద్దు అయింది.


Click it and Unblock the Notifications
