9 గంటలు నిద్ర పక్కా..
తాను కనీసం 9 నుంచి 10 గంటలు నిద్రపోతానని చెప్పుకొచ్చిన హిట్ మ్యాన్.. తన కూతురు సమైరా కారణంగా ఇటీవల కాస్త నిద్రపోవడం తగ్గించానని తెలిపాడు. ‘అశ్విన్ ఇది నువ్వు నమ్మవు.. కానీ నిజం. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో నేను ఒక్కసారి కూడా బ్రేక్ఫాస్ట్ టేబుల్ వద్దకు వెళ్లలేకపోయాను. టోర్నీలో మ్యాచ్లు ముగిసేసరికి అర్ధరాత్రి అవుతుంది.. ఇది ఒక కారణమైతే.. మరొక కారణం నేను కనీసం 9-10 గంటలు తప్పనిసరిగా నిద్రపోతా. కానీ.. సమైరా పుట్టిన తర్వాత తనతో కలిసే నిద్రపోతున్నా.. ఆమెతో పాటే నిద్రలేస్తున్నా. సమైరా మెళకువగా ఉన్న సమయంలో నిద్రపోవడం సాధ్యం కావడం లేదు'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
వడపావ్ మిస్సవుతున్నా..
ఇక లాక్డౌన్ కారణంగా తనకెంతో ఇష్టమైన వడపావ్ను మిస్సావుతున్నానని రోహిత్ తెలిపాడు. ఐపీఎల్ జరిగిన గత 12 ఏళ్లలో ప్రతి ఏడాది చౌపట్టి బీచ్లోని ఒక దుకాణానికి వెళ్లి వడపావ్ తినేవాడినని హిట్మ్యాన్ తెలిపాడు.అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడటం తో ఐపీఎల్ చరిత్రలో మొదటిసారిగా నేను అక్కడ వడపావ్ తినకుండా ఉండాల్సి వస్తుంది అని రోహిత్ అశ్విన్తో తన బాధను పంచుకున్నాడు.
సూపర్ ఫొటో షేర్ చేసిన హిట్ మ్యాన్..
ఈ లైవ్ సెషన్కు ముందు రోహిత్ తన సతీమణి రితికా సజ్డేతో ఉన్న ఓ అద్భుతమైన ఫొటోను పంచుకున్నాడు. దానికి ఓ సూపర్ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘నేర్చుకోవడం అనేది ఎప్పటికి ఆగదు. ఒకరికొకరం అర్థం చేసుకోవడం.. ఇలా ఆమె నాతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీలవుతున్నా. ఇన్ని రోజు ఏం కోల్పోయామో ఈ లాక్డౌన్ కాలం తెలియజేసింది. 'అని రోహిత్ క్యాప్షన్గా పేర్కొన్నాడు.