
భారత్ బ్యాట్స్మన్.. పాక్ బౌలర్లు
‘భారత్-పాక్ ఆల్టైమ్ ఎలెవన్ కోసం నా కొడుకుతో సుదీర్ఘంగా చర్చించా. అద్భుత ఆటగాళ్లలో నుంచి 11 మందిని ఎంపిక చేయడం చాలా కష్టంగా అనిపించింది. నా కుమారుడు మాత్రం చాలా సింపుల్గా పాకిస్థాన్ నుంచి బౌలర్లను, ఇండియా నుంచి బ్యాట్స్మన్ జట్టులోకి తీసుకుంటే అద్భుత జట్టు తయారవుతుందని తెలిపాడు.'అని రమీజ్ రాజా గవాస్కర్తో అన్నాడు. ఆ కారణంగా నా ఆల్టైమ్ జట్టులో భారత ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారన్నాడు.

ఏడుగురు భారత ఆటగాళ్లే..
ఇక రమీజ్ రాజా ఎంపిక చేసిన 11 మంది ఆటగాళ్లలో ఏడుగురిని భారత్ నుంచి ఎంపిక చేయడం గమనార్హం. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్లను ఓపెనర్లుగా తీసుకున్న రమీజ్.. ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ, సెకండౌన్లో ఆశ్చర్యకరంగా సచిన్ టెండూల్కర్ను ఎంపిక చేశాడు. సచిన్ తన కెరీర్లో ఈ నాలుగో స్థానంలో నిలకడగా రాణించలేదు. ఇక మిడిలార్డర్ బ్యాట్స్మన్గా ఐదు, ఆరు స్థానాల్లో టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ ఎంఎస్ ధోనీలను తీసుకున్నాడు.

కెప్టెన్గా ఇమ్రాన్ ఖాన్
ఈ జట్టుకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను సారథిగా ఎంచుకున్నాడు. అలాగే ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనీస్లను పేసర్లుగా.. అనిల్ కుంబ్లే, సక్లయిన్ ముస్తాక్లకు స్పిన్నర్లుగా తుది జట్టులో అవకాశం కల్పించాడు.
రమీజ్ రాజా ఆల్టైమ్ ఎలెవన్: వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనీస్, అనిల్ కుంబ్లే, సక్లయిన్ ముస్తాక్

రోహిత్, అఫ్రిదికి నో చాన్స్..
అయితే వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడు డబుల్ సెంచరీలతో చెలరేగిన భారత ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటుదక్కకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అలాగే పాకిస్థాన్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆల్రౌండర్గా ఆకట్టుకున్న షాహిద్ అఫ్రిదికి కూడా అవకాశం దక్కలేదు. అలాగే భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే ఒక్కరినే తీసుకోవడం కూడా ఈ ఆల్టైమ్ టీమ్ ఎంపికపై చర్చకు దారి తీసింది.


Click it and Unblock the Notifications

కోహ్లీ పద్దతి మార్చుకో.. అతనేం వాటర్ బాయ్ కాదు: కైఫ్










