అద్భుత బౌలింగ్..
నాటి మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుణుడు అడ్డంకిగా మారిన ఆ మ్యాచ్ రెండు రోజుల పాటు జరగ్గా న్యూజిలాండ్ తొలి రోజు 46.1 ఓవర్లలో 211/5తో నిలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను మరుసటి రోజుకు వాయిదా వేశారు. దీంతో తర్వాతి రోజు ఆ జట్టు మిగిలిన ఓవర్లు పూర్తి చేసి 8 వికెట్ల నష్టానికి 239 రన్స్ చేసింది. కేన్ విలియమ్సన్(67), రాస్ టేలర్(74) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భువనేశ్వర్(3) వికెట్లు తీయగా ఇతర భారత బౌలర్లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
ధోనీ- జడేజా సూపర్ ఇన్నింగ్స్..
ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ(50), రవీంద్ర జడేజా(77) ఆచితూచి ఆడుతూ అర్ధశతకాలతో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ప్రపంచకప్ చరిత్రలో ఏడో వికెట్కు అద్భుతమైన 116 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వారి సూపర్ ఇన్నింగ్స్తో విజయంపై ఆశలు రేకెత్తించారు. ఇక భారత విజయం లాంఛనమే అనుకున్న తరుణంలో భారీ షాట్ ఆడబోయిన జడేజా విలియమ్సన్ చేతికి చిక్కాడు. అయినా ధోనీ ఉన్నాడనే భరోసా ఉండగా.. ఆ వెంటనే గప్తిల్ విసిరిన సూపర్ త్రోకు మహీ రన్నౌ టయ్యాడు.
దీంతో కోట్లాది మంది భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. మైదానమంతా మూగబోయింది. చివరికి భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులు చేసి ఆలౌటైంది. అలా కోహ్లీసేన సెమీస్ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఐసీసీ నేడు ఒక ట్వీట్ చేసింది. నాటి మ్యాచ్ హైలెట్స్ వీడియోను అభిమానులతో పంచుకుంది.
ధోనీ- జడేజా సూపర్ ఇన్నింగ్స్..
ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ(50), రవీంద్ర జడేజా(77) ఆచితూచి ఆడుతూ అర్ధశతకాలతో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ప్రపంచకప్ చరిత్రలో ఏడో వికెట్కు అద్భుతమైన 116 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వారి సూపర్ ఇన్నింగ్స్తో విజయంపై ఆశలు రేకెత్తించారు. ఇక భారత విజయం లాంఛనమే అనుకున్న తరుణంలో భారీ షాట్ ఆడబోయిన జడేజా విలియమ్సన్ చేతికి చిక్కాడు. అయినా ధోనీ ఉన్నాడనే భరోసా ఉండగా.. ఆ వెంటనే గప్తిల్ విసిరిన సూపర్ త్రోకు మహీ రన్నౌ టయ్యాడు.
దీంతో కోట్లాది మంది భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. మైదానమంతా మూగబోయింది. చివరికి భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులు చేసి ఆలౌటైంది. అలా కోహ్లీసేన సెమీస్ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఐసీసీ నేడు ఒక ట్వీట్ చేసింది. నాటి మ్యాచ్ హైలెట్స్ వీడియోను అభిమానులతో పంచుకుంది.
ధోనీ బ్యాటింగ్ ఆర్డర్పై విమర్శలు..
ఇక ఈ ఓటమి అనంతరం ధోనీ బ్యాటింగ్ ఆర్డర్పై విమర్శలు వచ్చాయి. ఒత్తిడిని తట్టుకుని ఆడగలే అనుభవమున్న ధోనీని కాదని.. పంత్, పాండ్యాలను ముందుకు పంపించడం టీమ్ మేనేజ్మెంట్ వ్యూహ లోపమని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. ముందే ధోనీని పంపిస్తే పంత్, పాండ్యా వంటి దూకుడైన ఆటగాళ్లను నిలవరించేవాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా టాపార్డర్ విఫలమైతే ఏంటనే ప్రణాళిక కూడా లేకపోవడం దారుణమని మండిపడ్డారు. ఎంతసేపు కోహ్లీ, రోహిత్పైనే భారత్ ఆధారపడిందని, వారి విఫలమైతే ఏందనే ప్లాన్-బిని సిద్దం చేసుకోలేకపోయిందనే విమర్శలు వినిపించాయి.