
నేలకు కొట్టిన బంతిలా..
'టీమిండియా బలంగా పుంజుకుంటుందనే అంశాన్ని ఇంగ్లండ్ దృష్టిలో పెట్టుకోవాలి. ఆస్ట్రేలియాలోనూ తొలి టెస్టులో భారత్ ఓడింది. 36 పరుగులకే ఆలౌటైనా తర్వాత బలంగా పుంజుకుంది. రెండో టెస్టులో టాస్ ఓడితే ఇంగ్లండ్కు గెలుపు అవకాశాలు కష్టమవుతాయి. అయితే తొలి టెస్టులో గెలుపు కోసం కోహ్లీసేన సాధ్యమైనంతగా పోరాడింది. భారత పర్యటనలో ఇంగ్లండ్ 4-0తో క్లీన్స్వీప్ అవుతుందని చాలామంది అంచనా వేసారు. పర్యాటక జట్టుకు ఎలాంటి అవకాశం ఉందన్నారు. భారత్ సైతం ఆట పరంగా గొప్పగా కనిపించింది. ఆసీస్పై గెలవడం, విరాట్ తిరిగిరావడంతో అంతా అలాగే అంచనా వేసారు.

జాగ్రత్తగా ఉండాలి..
'ఈ విజయం ఇంగ్లండ్ను సరైన స్థానంలో నిలబెట్టింది. వారు అత్యుత్తమంగా ఆడారు. తొలి బంతి నుంచి ఆఖరి వరకు పట్టుదలతో ఉన్నారు. ఇదే జోరును వారిప్పుడు కొనసాగించాలి. ఫామ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీతో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా భారత్ ఓటమి దెబ్బతిన్నది. గెలవాలనే కసితోనే బరిలోకి దిగుతుంది. దానికి తగ్గట్లు ప్రణాళికలు రచించాలి. జేమ్స్ అండర్సన్కు రెస్ట్ ఇచ్చి స్టువర్ట్ బ్రాడ్ను తీసుకురావాలి. బెయిర్ స్టోను తుది జట్టులోకి తీసుకోవాలి'అని నాజర్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు.

రెండు కళ్లు చాలవు..
స్పిన్ను బాగా ఆడే తమ దేశ అత్యుత్తమ ఆటగాడు రూట్ అని, టెస్టుల్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ రికార్డులన్నీ అతను బద్దలుకొడతాడని ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. 'ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాళ్లలో కచ్చితంగా రూట్ ఒకడు. బహుశా అన్ని ఇంగ్లండ్ బ్యాటింగ్ రికార్డులను అతను బద్దలు కొడతాడని అనుకుంటున్నా. అలిస్టర్ కుక్ పేరిట ఉన్న 161 మ్యాచ్ల రికార్డును, అత్యధిక పరుగులనూ దాటేసే వీలుంది. రూట్కు ఇప్పుడు 30 ఏళ్లే. ఆల్టైమ్ ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజాల జాబితాలో కుక్, గ్రహమ్ గూచ్, పీటర్సన్ సరసన రూట్ ఉంటాడు. స్పిన్ను ఆడడంలో అతనే అత్యుత్తమం. అతనాడే స్వీప్ షాట్లు చూసేందుకు రెండు కళ్లు చాలవు'' అని హుస్సేన్ అన్నాడు.
India vs England: భారత్ గెలవాలంటే.. రోహిత్ శర్మతో సహా ఆ ఇద్దరిపై వేటు వేయాలి!


Click it and Unblock the Notifications












