కుల్దీప్ రావాల్సిందే..!
ఫస్ట్ టెస్ట్లో అశ్విన్కు అండగా నిలిచే రవీంద్ర జడేజా లేని లోటు స్పష్టంగా కనిపించింది. అశ్విన్ కట్టడిగా బౌలింగ్ చేసినా సహచర స్పిన్నర్లు అయిన వాషింగ్టన్ సుందర్, షెబాజ్ నదీమ్ దారుణంగా విఫలమయ్యారు. కెరీర్లో రెండో టెస్ట్ మాత్రమే ఆడుతున్న ఈ ఇద్దరు దారళంగా పరుగులిచ్చుకున్నారు. నదీమ్ 59 ఓవర్లలో 233 పరుగులిచ్చుకొని నాలుగు వికెట్లు తీశాడు. అదే ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ జాక్ లీచ్ 50 ఓవర్లలో 181 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కీలక రోహిత్, పుజారా వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు.
కాబట్టి నదీమ్ స్థానంలో కుల్దీప్ను జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. గత కొంత కాలంగా బెంచ్కే పరిమితమవుతున్న కుల్దీప్.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. పైగా అతను చివరి సారిగా ఆడిన టెస్ట్లో 5 వికెట్లు తీశాడు. కాబట్టి అతను జట్టులోకి వస్తే మేలు జరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం.
భారమైన రోహిత్ శర్మ..
ఫస్ట్ టెస్ట్లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 18 పరుగులు చేశాడు. అంతేకాకుండా గత 8 ఇన్నింగ్స్ల్లో రోహిత్ ప్రదర్శన అంత ఆశాజనకంగా ఏం లేదు. ఆరుసార్లు 30లోపే ఔటవ్వగా.. మూడు సార్లు అయితే కనీసం డబుల్ డిజిట్ స్కోర్ కూడా అందుకోలేదు. కాబట్టి అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ను తీసుకోవడం ఉత్తమమని విశ్లేషకులు సూచిస్తున్నారు. రోహిత్ కన్నా స్వదేశంలో మయాంక్ రికార్డు బాగుందంటున్నారు.
రోహిత్ 22 ఇన్నింగ్స్ల్లో 6 సెంచరీలు 79 సగటుతో పరుగులు చేశాడని, మయాంక్ 6 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు, 99.50 సగటుతో రాణించాడని గుర్తు చేస్తున్నారు. సెకండ్ టెస్ట్లో కూడా అగర్వాల్ చెలరేగితే భారత్ సునాయసంగా విజయం సాధిస్తుందని చెబుతున్నారు.
ఫామ్లో లేని రహానే..
'కెప్టెన్గా రహానే ఒకే.. బ్యాట్స్మెన్గా జట్టుకు భారమయ్యాడు.' ఇంగ్లండ్తో ఫస్ట్ టెస్ట్ అనంతరం రహానే గురించి ప్రముఖ కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన కామెంట్. ఈ మాటల్లోనే అతను జట్టుకు ఎంత భారమయ్యాడో స్పష్టంగా అర్థం అవుతుంది. ఆసీస్ పర్యటనలో మెల్బోర్న్ సెంచరీ తర్వాత రహానే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. గత 14 ఇన్నింగ్స్లో మెల్ బోర్న్ సెంచరీ మినహా అతని అత్యధిక స్కోర్ 46. 6 సార్లు 10 పరుగుల లోపే ఔటయ్యాడు.
ఫామ్లేక సతమతమవుతున్న రహానే స్థానంలో కేఎల్ రాహుల్ను తీసుకుంటే జట్టుకు మేలు జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా స్వదేశంలో రహానే కంటే కేఎల్ రాహుల్కు మంచి రికార్డు ఉంది. స్వదేశంలో రహానే 37.35 పరుగులతో రాణించగా.. కేఎల్ రాహుల్ 44.25 పరుగులు చేశాడు. 22 ఇన్నింగ్స్ల్లో రాహుల్ 9 హాఫ్ సెంచరీలు చేయగా.. రహానే 44 ఇన్నింగ్స్లో 11 హాఫ్ సెంచరీలు చేశారు.