
మాకు ధోనీ ఉన్నాడు..
‘క్రికెటర్లు కూడా పాత తరం సినిమాల్లాగే తమ గురించి తాము బాగా గొప్పగా ఊహించుకుంటారు. చెన్నై టీమ్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేకుండా అంతా కుటుంబంలా ఉంటారు. నిజంగా నీకు అసంతృప్తి ఉంటే వెళ్లిపోవచ్చు. ఎవరినీ నేను బలవంత పెట్టను. కొన్ని సార్లు విజయం తలకెక్కడం సహజం. నాకు ధోని రూపంలో బలమైన కెప్టెన్ ఉన్నాడు. అతనితో నేను మాట్లాడా. పరిస్థితి అంతా నియంత్రణలోనే ఉంది.

భయపడాల్సిన పనిలేదు..
ఒక వేళ మా జట్టులో కరోనా కేసులు పెరిగినా భయపడనవసరం లేదని చెప్పాడు. మా వద్ద ప్రతిభకు కొదవ లేదు. రైనా స్థానంలో సత్తా చాటేందుకు రుతురాజ్కు ఇది మంచి అవకాశం. అయినా ఇంకా ఐపీఎల్ మొదలే కాలేదు. భారీ డబ్బు (రూ. 11 కోట్లు)తో సహా తాను ఏం కోల్పోయాడో రైనా తర్వాత తెలుసుకుంటాడు' అని శ్రీనివాసన్ అన్నారు. అయితే అతని మాటలను బట్టి చూస్తే రైనా ఫ్రాంచైజీతో నెలకొన్న విభేదాలతోనే ఐపీఎల్ వీడినట్లు తెలుస్తోంది.

హోటల్ గది విషయంలో..
దుబాయ్లో తనకు కేటాయించిన హోటల్ గది పట్ల రైనాలో కలిగిన అసంతృప్తే చివరకు ఇలా హఠాత్తుగా వెళ్లిపోవడానికి కారణమైందని తెలిసింది. బయో బబుల్ వాతావరణంలో కఠిన నిబంధనలు పాటిస్తూ హోటల్లోనే ఆటగాళ్లు ఐసోలేషన్లో ఉండాల్సిన స్థితిలో తనకు ఇచ్చిన గది మొదటి రోజే రైనాకు నచ్చలేదు. కనీసం దానికి సరైన బాల్కనీ కూడా లేదని అతను అన్నట్లు తెలిసింది.
చివరకు సరిగ్గా ధోనికిచ్చిన తరహా గది తనకు కావాలంటూ అతను కోరాడు. అయితే తగిన స్పందన రాకపోవడంతో చివరకు ధోనికే విషయం చెప్పాడు. ఈ విషయంలో తానేమీ చేయలేనన్న ధోని... రైనా ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేయలేదు. దాంతో ధోనిపై కూడా అసహనం కనబరుస్తూ రైనా ‘వ్యక్తిగత కారణాలు' అంటూ స్వదేశం బయల్దేరిపోయాడని ప్రచారం జరుగుతుంది.

పిల్లల కంటే ఏదీ ముఖ్యం కాదు..
ఇక జట్టులో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రైనా భయాందోళనకు గురైనట్లు మరో విధంగా ప్రచారం జరుగుతుంది. ‘పిల్లల కంటే ఏదీ ముఖ్యం కాదు అని రైనా సహచరులతో అన్నాడు. అందుకే లీగ్ నుంచి వైదొలిగాడు' అని జాతీయ మీడియా పేర్కొంది.


Click it and Unblock the Notifications

ధోనీ రిటైర్మెంట్కు అదే కారణం: ఆర్పీ సింగ్










