For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీని ఆటగాడిగా నిలబెట్టి.. దీవించింది ఈ తెలుగు గడ్డ!

Ms dhoni special innings vs Pakistan in Vizag

హైదరాబాద్: మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్న వేళ.. రెండు దశాబ్దాల పాటు యావత్ భారతావని ఆశలు మోసిన మహేంద్ర సింగ్ ధోనీ.. అంతర్జాతీయ ఆటకు అల్విదా ప్రకటించిన విషయం తెలిసిందే. ధోనీ ఆకస్మిక నిర్ణయం అభిమానులను బాధించినా.. యువ తరానికి అవకాశం ఇవ్వాలనే ముందు చూపు అతనిపై ఉన్న గౌరవాన్ని రెట్టింపు చేసింది. అయితే యావత్ క్రికెట్ ప్రపంచంలో మహీ.. శిఖరంలా నిలబడటానికి.. ఇండియా క్రికెట్ ఐకాన్ నీరాజనాలు అందుకోవడానికి మాత్రం ఈ తెలుగు గడ్డ తొలి మెట్టు అయింది. అవును ధోనీని ఆటగాడిగా నిలబెట్టి.. దీవించింది మన తెలుగు గడ్డ విశాఖ నగరం.!

15 ఏళ్ల క్రితం 2005, ఏప్రిల్ 5 విశాఖ తీరానా ధోనీ బ్యాటింగ్ విధ్వంసంతో తన పేరును ప్రపంచానికి పరిచయం చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పొడువాటి జుంపాలతో వినూత్నంగా కనిపించిన ధోనీ.. ప్రత్యేకమైన బ్యాటింగ్ శైలితో తన సత్తా చాటాడు. అప్పటికే మూడుసార్లు వచ్చిన అవకాశాలను చేజార్చుకున్న మహీ.. తప్పక ఆడాల్సిన మ్యాచ్‌లో చెలరేగాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఎంతలా అంటే అతని జుంపాల జుట్టును అభిమానులంతా ఫాలో అయ్యేంత క్రేజ్ తెచ్చుకున్నాడు.

గంగూలీ ప్రోత్సాహంతో..

గంగూలీ ప్రోత్సాహంతో..

నాటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మహీ నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన ధోనీ.. ఆ మ్యాచ్‌లో అనవసర పరుగుకు ప్రయత్నించి డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం జరిగిన మూడు వన్డేల్లో 12, 7 నాటౌట్, 3 పరుగులే చేశాడు. అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ.. విశాఖ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా ఫస్ట్ డౌన్‌లో వచ్చాడు.

సెహ్వాగ్‌తో కలిసి

సెహ్వాగ్‌తో కలిసి

ఈ మ్యాచ్ నాలుగో ఓవర్లోనే లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఔటవ్వడంతో... క్రీజులోకి వచ్చిన ధోనీ.. సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆసాధారణ రీతిలో బ్యాటింగ్‌ చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్.. నాటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో నాలుగో వికెట్‌కు 96 పరుగులు.. రాహుల్ ద్రవిడ్‌తో 149 రన్స్ జోడించాడు.

123 బంతులు ఆడిన ధోనీ.. 15 ఫోర్లు 4 సిక్స్‌లతో 148 పరుగుల చేశాడు. నాటి పాక్ దిగ్గజ బౌలర్లు మహ్మద్ సమీ, నవీద్ ఉల్ హసన్, షాహిద్ అఫ్రిదీ, మహ్మద్ హఫీజ్ బౌలింగ్‌ను చీల్చి చిండాడాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 356 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 298 పరుగులకు ఆలౌటైంది. నెహ్రా 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ సెంచరీతో ధోనీ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఈ అద్భత సెంచరీతో ఆస్ట్రేలియా దిగ్గజ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 172,154 తర్వాత ధోనీ నిలిచాడు.

శ్రీలంకపై సూపర్ సెంచరీ..

శ్రీలంకపై సూపర్ సెంచరీ..

ఈ సిరీస్ అనంతరం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 183 నాటౌట్‌తో గిల్ క్రిస్ట్‌ను రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తం తన వన్డే కెరీర్‌లో మొత్తం 9 సార్లు మూడంకెల స్కోర్ చేసిన ధోనీ.. 50.57 సగటుతో 73 హాఫ్ సెంచరీలతో 10773 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ధోనీ.. భారత్ తరఫున 16 ఏళ్లు ఆడాడు. ఈ క్రమంలో భారత్ తరఫున 350 వన్డేల్లో 50.57 యావరేజ్‌తో 12,303 రన్స్ సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.. బెస్ట్ స్కోర్ 183 నాటౌట్. ఒక వికెట్ కూడా తీశాడు.

అందుకేనా ఈ అనూహ్య నిర్ణయం..

అందుకేనా ఈ అనూహ్య నిర్ణయం..

నిజానికి షెడ్యూల్‌ ప్రకారం మార్చిలో జరగాల్సిన ఐపీఎల్‌ కోసం ధోనీ సిద్ధంగా ఉన్నాడు. అందరికంటే ముందే చెన్నైలో ప్రాక్టీస్‌ కూడా ఆరంభించాడు. ఆ సమయంలో అతను అత్యంత ఫిట్‌గానూ కనిపించాడు. ఈ లీగ్‌లో తానేంటో నిరూపించుకుని టీ20 ప్రపంచక్‌పలో ఆడాలనే భావనలో ఉన్నాడు. కానీ కరోనా ప్రభావంలో లీగ్‌ సెప్టెంబరుకు, పొట్టి ప్రపంచకప్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో ధోనీ పునరాలోచనలో పడ్డట్టున్నాడు. ఆ సమయానికి అతను 40 ఏళ్లకు చేరుకోవడంతో పాటు అంత సమయం వేచి చూడడం అనవసరమని, కుర్రాళ్లు కుదురుకునేందుకు అవకాశం కూడా ఇచ్చినట్టవుతుందని ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సన్నిహితులు తెలిపారు.

బాలేదు ధోనీ.. ఇది ఏ మాత్రం బాలేదు!

Story first published: Sunday, August 16, 2020, 15:03 [IST]
Other articles published on Aug 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+