హైదరాబాద్: టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్లో పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ఆడేందుకు మార్గం సుగమం అయింది. ఈ మేరకు మిడిల్సెక్స్ జట్టు మేనేజ్మెంట్ అతడితో ఒప్పందం చేసుకుంది. వ్యక్తిగత కారణాల వద్ద దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చివరి గ్రూప్ మ్యాచ్లకు దూరమయ్యాడు.
భారత్ Vs విండిస్: సిరిస్ విజేతను తేల్చే 3rd ODIకి పొంచి ఉన్న వర్షం ముప్పు?
దీంతో ఏబీ డివిలియర్స్ స్థానాన్ని హ్మద్ హఫీజ్తో భర్తీ చేసింది. టోర్నీలో భాగంగా మిడిల్సెక్స్ జట్టు ఆగస్టు 29న హాంఫ్షైర్ జట్టుతో తలపడుతుండగా... ఆగస్టు 30న సోమర్సెట్తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ల్లో డివిలియర్స్ స్థానంలో మహ్మద్ హఫీజ్ బరిలోకి దిగనున్నాడు.
ప్రస్తుతం మిడిల్సెక్స్ జట్టు కెప్టెన్గా ఉన్న డావిడ్ మిలన్... మహ్మద్ హఫీజ్లు గతంలో పాకిస్థాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మీ జట్టుకు ఆడారు. 2017 సీజన్లో పెషవార్ జల్మీ టైటిల్ విజేతగా నిలవడంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారు. 38 ఏళ్ల మహ్మద్ హఫీజ్ ఇటీవలే ముగిసిన వరల్డ్కప్లో పాక్ తరుపున ఆడాడు.
క్రికెటర్గానే కాదు మనిషిగా కూడా: పంత్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు
అయితే, రెండు రోజుల క్రితం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులో మహ్మాద్ హఫీజ్కు చోటు దక్కలేదు. 2019-20 సీజన్కు సంబంధించి ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితా నుంచి ఈ ఇద్దరు క్రికెటర్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పించింది. ఇప్పటికే టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన హఫీజ్ ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కొనసాగుతున్నాడు.